యాప్నగరం

సుశాంత్ కేసు త్వరలోనే క్లోజ్.. ఫైనల్ రిపోర్ట్ ఇచ్చే పనిలో పోలీసులు

సుశాంత్ ఆత్మహత్యతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అతని కుటుంబసభ్యులు, ఇంట్లో పనిచేసే సిబ్బందితో పాటు.. పలువురు సినీ ప్రముఖుల్ని సైతం విచారించారు.

Samayam Telugu 14 Jul 2020, 10:53 am
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ రాజ్‌ఫుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 14న సుశాంత్ బాంద్రాలో తాను నివాసం ఉంటున్నఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో సుశాంత్ మరణంపై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దర్యాప్తు చేశారు. సుశాంత్ కొందరి వేధింపుల వలననే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నాడని పలువురు వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదుగురితో కూడిన అధికారుల టీం దాదాపు 35 మందికి పైగా వ్యక్తులని విచారించింది. సుశాంత్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొలీగ్స్ అందరితో మాట్లాడారు. అతడి గదిలో అన్ని వస్తువులనూ స్వాధీనపరుచుకుని పరిశీలించారు.
Samayam Telugu సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
sushant singh rajput


అయితే సుశాంత్ కేసును క్లోజ్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. గత కొద్ది రోజులుగా సీరియస్‌గా ఈ కేసుకు సంబంధించిన విచారణ నడుస్తోంది. అయితే ఈ విచారణ ప్రక్రియకి ఇక ముగింపు పలకాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.విచారణలో ఎలాంటి విషయాలు బయటకు రాలేదని, వేరకొరి ప్రమేయం ఉందా లేదా అనే దానిపై ఫోరెన్సిక్ నిపుణులతో కూడా మాట్లాడమని పోలీసులు చెబుతున్నారు. అన్ని విషయాలపై సమగ్ర నివేదికని రూపొందిస్తున్నామని అంటున్నారు. తుది నివేదకని ఇంకో పది రోజులలో ఉన్నతాధికారులకి అప్పగించనున్నట్లు సమచారాం. ఎలాంటి సంచలనాలు లేకుండానే త్వరలోనే సుశాంత్ కేసు క్లోజ్ కానుందని సమాచారం.
Read More: క్వారంటైన్‌కు యాక్టర్ రవికిషన్.. పీఏకు కరోనా రావడంతో..
మరోవైపు సుశాంత్ మరణించి నెలరోజులు గడుస్తున్నా.. అతడి అభిమానులు మాత్రం సుశాంత్ ఆలోచనల నుంచి బయట పడలేకపోతున్నారు. తమ అభిమాన నటుడ్ని నిత్యం తలుస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో మెసేజులు పోస్టు చేస్తూనే ఉన్నారు. సుశాంత్ చివరిసారిగా నటించిన దిల్ బేచారా సినిమా ట్రైలర్ కూడా విడుదల కావడంతో సుశాంత్‌ను చాలా మిస్ అవుతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.