యాప్నగరం

మధ్యలోకి నన్నెందుకు లాగుతున్నారు: లైంగిక వేధింపుల వివాదంపై నటి ఫైర్

అనురాగ్ కశ్యప్‌పై లైంగిక వేధింపుల కేసులో తనను మధ్యలోకి లాగినందుకు బాలీవుడ్ నటి అనురాగ్ కశ్యప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరువుకు భంగం కలిగించినందుకు దావా వేస్తానన్నారు.

Samayam Telugu 21 Sep 2020, 4:06 pm
బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై నటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక ఆరోపణల ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సినిమా అవకాశాల కోసం వెళ్లిన తనను కశ్యప్ గదిలోకి తీసుకెళ్లి బ్లూఫిలిమ్ చూపించి లైంగిక వేధించాడని పాయల్ ఆరోపించింది. ఈ క్రమంలోనే అతడితో కొందరు హీరోయిన్లు పడక సుఖం పంచుకున్నారంటూ పేర్లు వెల్లడించింది. ఇందులో ప్రముఖ నటి రిచా చద్దా పేరు కూడా ఉండటంతో ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు సంబంధం లేని వివాదంలోకి తన పేరు వాడి పరువుకు భంగం కలిగించే వారిని వదిలి పెట్టనని రిచా అంటోంది.
Samayam Telugu రిచా చద్దా


Also Read: బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు: రకుల్‌కు బిగుస్తున్న ఉచ్చు.. త్వరలో నోటీసులు!

తన పేరును వివాదంలోకి లాగిన పాయల్ ఘోష్‌పై చర్యలు తీసుకోవాలని రిచా నిర్ణయించుకున్నట్లు ఆమె తరుపు లాయర్ సోమవారం తెలిపారు. ‘అనురాగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో మూడో వ్యక్తి నా క్లైయింట్‌ రిచా చద్దా పేరును అనవసరంగా తీసుకువచ్చారు. ఆమె అన్యాయానికి గురైన మహిళలకు న్యాయంగా జరగాలని కోరుకునే వ్యక్తి. అలాంటిది ఆమె పేరును అవమానకర రీతిలో వాడారు. ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా ఇతరులను అనవసరంగా వివాదంలోకి లాగి సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని కించపరిచారు. తనకు జరిగిన అన్యాయంపై పోరాడే మహిళకు మరొక మహిళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే హక్కు లేదు. దీన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం’ అని రిచా తరపు లాయర్ అన్నారు.

Also Read: RRR: తారక్ టీజర్‌ ముహూర్తం ఫిక్స్! గెట్ రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. రాజమౌళి కీలక నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.