యాప్నగరం

శిల్పా శెట్టి ఫ్యామిలీలో కరోనా కలకలం.. ఆమె మాత్రం సేఫ్..

సాగరకన్య శిల్పాశెట్టి ఫ్యామిలీలో కరోనా కలకలం సృష్టించింది. ఆమె అత్తామామలు, తల్లి, భర్త, పిల్లలు అందరూ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది.

Samayam Telugu 7 May 2021, 6:25 pm
రెండో దశలో కరోనా వైరస్ ప్రభావం సినీ తారలపై గట్టిగానే ఉంది. బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, మాధవన్, విక్కీ కౌశల్, భూమీ ఫడ్నేకర్, ఆలియా భట్, కత్రినా కైఫ్ తదితరులు వైరస్ బారిన పడి కోలుకున్నారు. ఇక టాలీవుడ్‌లో పవన్‌కళ్యాణ్, అల్లు అర్జున్, పూజా హెగ్డే తదితర ప్రముఖులకు వైరస్ సోకింది. ఈమధ్యే బాలీవుడ్ నటి దీపికా పదుకొనే కుటుంబం మొత్తానికి వైరస్ సోకిన విషయం తెలిసిందే. తాజాగా ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి శిల్పా శెట్టి కుటుంబంలో కరోనా కలకలం సృష్టించింది.
Samayam Telugu శిల్పా శెట్టి
Shilpa Shetty


శిల్పాశెట్టి మినహా ఆమె కుటుంబంలో అందరికీ వైరస్ సోకింది. ఆమె అత్తామామలు, తల్లి, పిల్లలు సమిషా, వియాన్, భర్త రాజ్ కుంద్రాలకు వైరస్ సోకినట్లు ఆమె సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘గత పది రోజులు మాకు చాలా కష్టంగా గడిచాయి. మా అత్తామామలకు ముందు కోవిడ్-19 పాజిటివ్‌గా వచ్చింది. వారి తర్వాత సమిషా, వియాన్, మా అమ్మ చివరిగా రాజ్ ఒకరి తర్వాత ఒకరు వైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం వాళ్లు కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఎవరి గదిలో వాళ్లు ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అంతేకాక.. మా ఇంట్లో పని చేసే వారిలోనూ ఇద్దరికి కోవిడ్ పాజిటివ్‌ వచ్చింది. దేవుడి దయతో అందరూ కోలుకొనే దశలో ఉన్నారు. నా రిపోర్టులు మాత్రం నెగటివ్‌గా వచ్చాయి. బీఎంసీ, అధికారులు విధించిన అన్ని నిబంధనలు పాటిస్తున్నాము. మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి మాస్క్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి’’ అంటూ శిల్పా పేర్కొంది.
View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

ఇక రెండో దశలో కరోనా దేశంలో విలయ తాండవం ఆడుతోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా రోగులతో ఆస్పత్రులు అన్ని నిండిపోతున్నాయి. సరైన సమయానికి వైద్య సౌకర్యం అందక.. కరోనా రోగులు ప్రాణాలు విడుస్తున్నారు. కొందరు తమకు కరోనా సోకిందనే భయంతోనే కొందరు మరణిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికి వాళ్లు స్వీయనియంత్రణ పాటించాలని.. అవసరం ఉంటే తప్పా బయటకు రావొద్దంటూ ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.