యాప్నగరం

బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు: నలుగురు హీరోయిన్లకు నోటీసులిచ్చిన ఎన్సీబీ

సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్ కేసుతో బయటపడిన బాలీవుడ్ డ్రగ్స్ లింకుల కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొొంటున్న నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ నోటీసులు జారీ చేసింది.

Samayam Telugu 23 Sep 2020, 7:22 pm
డ్రగ్స్‌ కేసులో రోజుకో కొత్త మలుపుతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఏరోజు ఎవరి పేరు బయటపడుతుందోనని అందరూ భయపడుతున్నారు. మరోవైపు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. దీపికా పదుకొనే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌తో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్‌కు నోటీసులు అందాయి.
Samayam Telugu బాలీవుడ్ హీరోయిన్లకు నోటీసులు


Also Read: టాలీవుడ్‌లోకి మాజీ మిస్ ఇండియా ఎంట్రీ.. ‘బ్లాక్ రోజ్’‌లో షైలాక్ తరహా పాత్ర

డ్రగ్స్ కేసులో విచారణ నిమిత్తం మూడు రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలంటూ ఎన్సీబీ ఆ నలుగురికి నోటీసుల్లో పేర్కొంది. హీరో సుశాంత్ మృతి కేసును దర్యాప్తు చేసే క్రమంలో బాలీవుడ్‌ డ్రగ్స్ లింకులు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. డ్రగ్స్‌ లింకులతో సంబంధమున్న 25 మంది పేర్లను రియా వెల్లడించడంతో తీవ్ర కలకలం రేగింది. తాజాగా దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను ప్రశ్నించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read: సుశాంత్‌ డ్రగ్స్ కోసం నన్ను వాడుకున్నాడు: రియా సంచలన ఆరోపణలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.