యాప్నగరం

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ దర్శక నిర్మాత కన్నుమూత

మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ బక్షీ నేడు (సెప్టెంబర్ 5) గుండెపోటుతో మరణించారు.

Samayam Telugu 5 Sep 2020, 10:20 pm
బాలీవుడ్‌ని వరస విషాదాలు వెంటాడుతున్నాయి. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ మరణంతో పాటు.. ఇర్ఫాన్ ఖాన్, రిషికపూర్, సరోజ్ ఖాన్, రాజన్ సెహగల్ ఇలా బాలీవుడ్ ప్రముఖులు 25 మంది కన్నుమూశారు. ఇప్పుడు మ‌రో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ బక్షీ నేడు (సెప్టెంబర్ 5) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
Samayam Telugu జానీ బక్షీ
passes away


ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు కాగా.. గత కొంతకాలంగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. కొన్నాళ్లు పాటు ఇంటి దగ్గరే వైద్యం అందించగా.. సెప్టెంబర్ 4 నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో జుహులోని ఆరోగ్య నిధి ఆసుపత్రిలో చేర్పారు. ఆయితే శుక్రవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

నిర్మాతగా దర్శకుడిగా జానీ బక్షి పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. మంజిలే ఔర్ భీ హై , రావణ్ , ఫిర్ తేరీ కహానీ యాద్ ఆయీ లాంటి హిట్ చిత్రాలను నిర్మించగా.. డాకూ ఔర్ పోలీస్ , ఖుదాయి చిత్రాలకు దర్శకత్వం వహించి అటు నిర్మాతగా.. ఇటు దర్శకుడిగా రాణించారు. జానీ బక్షీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.