యాప్నగరం

SSR Case: సుశాంత్ సూసైడ్ కేసుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు.. హీరోయిన్ల మరణాలు, గతం వెలికితీస్తూ ఫైర్

రోజుకో మలుపు తిరుగుతూ మిస్టరీని తలపిస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై తనదైన కోణంలో స్పందించింది సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి. గతంలో జరిగిన ఇలాంటి సంఘటనలను గుర్తుచేస్తూ ఫైర్ అయింది.

Samayam Telugu 4 Sep 2020, 1:19 pm
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు యావత్ భారతదేశంలో చర్చనీయాంశంగా నిలిచింది. ఆయనది ఆత్మహత్య అని పోస్ట్‌మార్టం రిపోర్టులో తేలినప్పటికీ పలు ఆరోపణలు, అనుమానాలు వెల్లువెత్తడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాపు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ, సీబీఐ, ఎన్‌సీబీ అధికారులు రంగంలోకి దిగి లోతుగా విచారణ జరుపుతున్నారు. దీంతో ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ మిస్టరీని తలపిస్తోంది. అయితే తాజాగా సుశాంత్ సూసైడ్ కేసు విషయమై రియాక్ట్ అయిన సీనియర్ నటి విజయశాంతి గతాన్ని తవ్వుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
Samayam Telugu సుశాంత్ సూసైడ్ కేసుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
Vijayashanthi Sushanth singh Rajputh


''బాలీవుడ్ యువహీరో సుశాంత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. దోషులను పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ, సినీ రంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణ పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కానీ, వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగేలా ఈ స్థాయిలో విచారణ, దర్యాప్తు జరిగాయా? ఎందరో నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తే నామమాత్రంగా కేసులు నమోదు, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడం చూశాం. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి'' అని పేర్కొంటూ ఫైర్ అయింది విజయశాంతి.

Also Read: సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారం.. హీరోయిన్ సంజన గల్రానీ ఆవేదన

''వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం చాలా బాధాకరం. అయితే దర్యాప్తు, విచారణ అనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. ఈ విషయంపైన ఒక జాతీయ టీవీ చానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ.. సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా న్యాయప్రక్రియ ఒకేలా ఉన్నప్పుడే న్యాయాన్ని ఆశించగలమని అన్నారు. ఇలాంటి ఎన్నో సంచలనాత్మక కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు ఆధారాలను సమర్పిస్తాయి కానీ.. ఆ కేసుల్లో వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్లకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారిపోతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి'' అంటూ ఆవేదన చెందింది విజయశాంతి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.