సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య భర్తతో విడాకులు తీసుకునేందుకు నిర్ణయించకున్న సంగతి తెలిసిందే. ఆమె భర్త అశ్విన్ రామ్ కుమార్ బిజినెస్ మ్యాన్. వీరిద్దరి పెళ్లి 2010లో జరిగింది. వీరికి ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడు. కాగా ఆరునెలల నుంచి వీరిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. ఏడాదిగా వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. కొన్ని వారాలుగా సౌందర్య-అశ్విన్ విడిపోనున్నారని వార్తలు గుప్పుమంటూనే ఉన్నాయి. దీనిపై సౌందర్య కొన్ని రోజుల క్రితమే తాము విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నామని చెప్పి క్లారిటీ ఇచ్చింది. కాగా సౌందర్య, ఆమె భర్త చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సౌందర్య విడాకుల కోసం పిటిషన్ వేసింది. కోర్టు డిసెంబర్ 23 కు కేసును వాయిదా వేసింది. ఇప్పుడు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని కోరుకుంటున్నారు కాబట్టి... వారికి త్వరగానే విడాకులు మంజూరు అవుతాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో సౌందర్య విడాకుల కోసం పిటిషన్ వేసింది. కోర్టు డిసెంబర్ 23 కు కేసును వాయిదా వేసింది. ఇప్పుడు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవాలని కోరుకుంటున్నారు కాబట్టి... వారికి త్వరగానే విడాకులు మంజూరు అవుతాయి.