తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 2.0 మూవీ ఫస్ట్ లుక్ ముంబైలో రిలీజ్ కానుందనే సంగతి తెలిసిందే. అయితే, ఆ రోజు ఎప్పుడు, ఏంటనే వివరాలు మాత్రం పెద్దగా బయటకి పొక్కలేదు. కానీ ఈ సినిమాని నిర్మిస్తున్న లికా ప్రొడక్షన్స్కి చెందిన రాజు మహాలింగం చేసిన ట్వీట్తో ఇటీవలే ఆ వివరాలు కూడా వెల్లడయ్యాయి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్కి సెల్యూలాయిడ్ రూపంతో గ్లోబల్ స్టాండర్డ్స్తో వస్తోన్న 2.0 మూవీ ఫస్ట్ లుక్ని నవంబర్ 20వ తేదీన ఆడియెన్స్ ముందుకు తీసుకురానున్నట్టు ఈ ట్వీట్ ద్వారా తెలిపారు.
"Make in India" a reality on celluloid!! 2.0 team delivers Global Standard's!!We will tease you'll on 20th Nov-2016. pic.twitter.com/UXv7YS6j6B— raju.mahalingam (@rajumahalingam) October 14, 2016
శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రజినీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. తొలిసారిగా అక్షయ్ కుమార్ తమిళంలో నటిస్తున్న సినిమా ఇదే. 2010లో రిలీజైన రోబో(తమిళంలో ఎంథిరన్) సినిమాకి ఇది సీక్వెల్. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న 2.0 మూవీ భారీ బడ్జెట్ పరంగా దేశవ్యాప్తంగా వున్న సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుందీ సినిమా.
"Make in India" a reality on celluloid!! 2.0 team delivers Global Standard's!!We will tease you'll on 20th Nov-2016. pic.twitter.com/UXv7YS6j6B— raju.mahalingam (@rajumahalingam) October 14, 2016
శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రజినీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తుండగా అక్షయ్ కుమార్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. తొలిసారిగా అక్షయ్ కుమార్ తమిళంలో నటిస్తున్న సినిమా ఇదే. 2010లో రిలీజైన రోబో(తమిళంలో ఎంథిరన్) సినిమాకి ఇది సీక్వెల్. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న 2.0 మూవీ భారీ బడ్జెట్ పరంగా దేశవ్యాప్తంగా వున్న సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుందీ సినిమా.