యాప్నగరం

Vijayendra Prasad: వీరగాథతో వస్తున్న విజయేంద్ర ప్రసాద్.. RRR రైటర్ నుంచి ‘బ్రహ్మపుత్ర’

‘RRR, బాహుబలి’ వంటి భారీ సినిమాలకు కథ అందించిన లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. జనరల్ లచిత్ బోర్ఫుకాన్ కథను నవల రూపంలో తీసుకొస్తున్నారు. మే 30న విడుదల కానున్న ఈ నవల కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Authored byసంతోష్ దామెర | Samayam Telugu 18 May 2023, 10:22 pm

ప్రధానాంశాలు:

  • విజయేంద్ర ప్రసాద్ ‘బ్రహ్మపుత్ర’ నవల
  • కుల్‌ప్రీత్ యాదవ్‌తో కలిసి రచన
  • జనరల్ లచిత్ బోర్ఫుకాన్ స్టోరీ
  • మే 30న విడుదల చేస్తున్న పబ్లిషర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu VIjayendra Prasad
VIjayendra Prasad: విజయేంద్ర ప్రసాద్
స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad).. రాజమౌళి (Rajamouli) నెక్ట్స్ మహేష్ బాబుతో తీయబోయే SSMB29 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని తెలుసు. కానీ అంతకుముందే ఆయన మరొక ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నారు. 17వ శతాబ్దపు జనరల్ లచిత్ బోర్ఫుకాన్ స్టోరీని (Lachit Borphukan Story) ‘బ్రహ్మపుత్ర: ది అహోం సన్ రైజెస్’ (Brahmaputra: The Ahom Son Rises) అనే నవల రూపంలో తీసుకొస్తున్నారు. ఇందు కోసం రాజ్యసభ ఎంపీ అయిన విజయేంద్ర ప్రసాద్.. గూఢచర్య కాల్పనిక రచయితగా మారిన నేవల్ ఆఫీసర్‌ కుల్‌ప్రీత్ యాదవ్‌తో (Kulpreet Yadav) కలిసి పనిచేస్తున్నారు. హార్పర్‌కాలిన్స్ పబ్లిషర్స్ ఇండియా.. మే 30న ఈ నవలను విడుదల చేస్తోంది.
లచిత్ బోర్ఫుకాన్ ఒకప్పుడు అస్సాంలోని అహోం రాజ్యంలో జనరల్. 1671 సరైఘాట్ యుద్ధంలో తన నాయకత్వ పటిమతో గుర్తింపు పొందాడు. మొఘలులను చాలాసార్లు ఓడించిన లచిత్.. వారి నుంచి గౌహతిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు.
ఈ కథ యాక్షన్, రొమాన్స్ కలగలిసి ఉంటుంది. లచిత్.. అహోం రాజ్యాన్ని పాలించిన స్వర్గదేవ్ జయధ్వజ సింఘా కుమార్తె యువరాణి పద్మినితో ప్రేమలో పడతాడు. వీరి రొమాన్స్ గురించి తెలుసుకున్న రాజు.. లచిత్‌ని రాజధాని జోర్హాట్ నుంచి బయటకు పంపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత అహోం రాజధానిపై ఔరంగజేబు దళాలు దాడి చేస్తాయి. తద్వారా రాజ్యంలో కొంత భాగాన్ని మొఘల్‌లకు అప్పగిస్తాడు స్వర్గ దేవ్. కానీ క్రమంగా ప్రమాదంలో పడుతున్న రాజధాని నగరాన్ని యువరాజు చక్రధ్వజ్‌తో కలిసి రక్షించేందుకు పూనుకున్న లచిత్.. ఈ యుద్ధంతో అహోం రాజ్య భవిష్యత్తును ఏ విధంగా మారుస్తాడు? అనేది స్టోరీ.

ఈ ‘బ్రహ్మపుత్ర’ నవలకు విజయేంద్ర ప్రసాద్‌‌కు కుల్‌ప్రీత్ యాదవ్ రచనా సహకారం అందించారు. ఆయన నేవల్ ఆఫీసర్స్ అకాడమీ అధికారిగా రెండు దశాబ్దాలు పనిచేశాడు. అతని మొత్తం కెరీర్‌లో మూడు నౌకలను విజయవంతంగా నడిపించాడు. 2014లో ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రిటైర్ అయినప్పటి నుంచి ‘గూఢచర్యం, సైనిక చరిత్ర, ట్రూ క్రైమ్’ వంటి జానర్స్‌లో పుస్తకాలు రచించాడు. అతని తాజా పుస్తకం ‘ది బ్యాటిల్ ఆఫ్ రెజాంగ్ లా’ (పెంగ్విన్ 2021).

రచయిత గురించి
సంతోష్ దామెర
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, సినిమా, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.