యాప్నగరం

ఆది సాయికుమార్‌కు కరోనా పరీక్ష.. వీడియో షేర్ చేసిన హీరో

లాక్‌డౌన్ తరవాత సినిమా షూటింగ్‌లు, డబ్బింగ్ పనులతో బిజీ అయిన నటీనటులు సామాజిక బాధ్యతగా కొవిడ్ పరీక్ష చేయించుకుంటున్నారు. తాజాగా ఆది సాయికుమార్ చేయించుకున్నారు.

Samayam Telugu 20 Jan 2021, 12:06 pm
కరోనా మహమ్మారి కారణంగా సుమారు ఏడెనిమిది నెలలు కెమెరాకు దూరమైపోయిన నటీనటులు ప్రస్తుతం తమ ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయారు. స్టార్ హీరోల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు వరుసగా సినిమాలు చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లు జరుపుతున్నారు. అయినప్పటికీ వ్యక్తిగత భద్రత, సామాజిక బాధ్యతలో భాగంగా హీరోలు ఎప్పటికప్పుడు కొవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇటీవల రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలానే కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.
Samayam Telugu కరోనా పరీక్ష చేయించుకుంటున్న ఆది
Aadi Saikumar


Meenakshi Chaudhary: బాలీవుడ్ యంగ్ బ్యూటీతో రవితేజ లిప్‌లాక్.. కష్టపడి ఒప్పించిన దర్శకుడు!!
ఇదిలా ఉంటే, తాజాగా హీరో ఆది సాయికుమార్ కరోనా పరీక్ష చేయించుకున్నారు. తాను కరోనా పరీక్షకు నమూనాలు ఇస్తున్నప్పుడు తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పరీక్షలో ఆదికి నెగిటివ్ రావాలని ఆయన అభిమానులు, ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే, పరీక్షకు నమూనాలు ఇస్తున్న వీడియో పెట్టారు కానీ.. ఫలితం ఏంటనేది మాత్రం ఆది ఇంకా వెల్లడించలేదు. ఆయనకి కచ్చితంగా కొవిడ్ నెగిటివ్ రావాలని కోరుకుందాం.
View this post on Instagram A post shared by ActorAadi (@aadipudipeddi)
కాగా, ఆది ‘శశి’ సినిమాతో వస్తున్నారు. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుర‌భి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల ద‌ర్శక‌త్వం వహించారు. శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మించారు. అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చారు. అమరనాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫి అందించారు. ఆది సాయికుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన టీజ‌ర్‌కు మంచి స్పందన ల‌భించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.