యాప్నగరం

‘అమరేంద్ర’నే కాదు, ‘నరేంద్ర’నూ మించిపోయాడు!

అమీర్ ఖాన్.. ‘బాహుబలి-2’ తర్వాత బాలీవుడ్ ప్రజలు ఎక్కువగా కలవరిస్తున్న పేరు. అమీర్ ‘దంగల్’ చిత్రం చైనాలో విడుదల చేసి.. ‘బాహుబలి-2’తో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

TNN 25 May 2017, 5:41 pm
మీర్ ఖాన్.. ‘బాహుబలి-2’ తర్వాత బాలీవుడ్ ప్రజలు ఎక్కువగా కలవరిస్తున్న పేరు. అమీర్ ‘దంగల్’ చిత్రం చైనాలో విడుదల చేసి.. ‘బాహుబలి-2’తో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అమరేంద్ర బాహుబలితో పోటీలో ఉన్న అమీర్ ఇప్పుడు నరేంద్ర మోదీని కూడా మించిపోయాడు. ఔనండి నిజమే. చైనాలో ‘ట్విట్టర్’ లాంటి సోషల్ మీడియా ‘వైబో-Weibo’లో ఇప్పటి వరకు నరేంద్ర మోదీకి మాత్రమే అత్యధిక ఫాలోవర్లు కలిగిన భారతీయ ప్రముఖుడిగా ఉన్నారు.
Samayam Telugu aamir khan becomes the most followed indian on weibo surpasses even pm modi
‘అమరేంద్ర’నే కాదు, ‘నరేంద్ర’నూ మించిపోయాడు!




అయితే, దంగల్ విడుదల తర్వాత.. అమీర్ ఖాన్ ఫాలోవర్లలో మోదీని మించిపోయారు. మోదీ అకౌంట్‌ను 1,68,877 మంది ఫాలో అవుతుంటే.. అమీర్‌ను 6,68,542 మంది ఫాలో అవుతున్నారు. చైనాలో ‘దంగల్’ను ‘లెట్స్ వ్రెస్ట్లే డాడ్’ పేరుతో విడుదల చేశారు. ఇప్పటికీ ఈ సినిమా మాంచి వసూళ్లతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో అమీర్‌ఖాన్ చైనా వైబో అకౌంట్‌.. ఇండియాలోని ట్విట్టర్ అకౌంట్‌ను మించినా ఆశ్చర్యపోవక్కర్లేదు!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.