యాప్నగరం

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ ఫోనే చేయలేదు.. అవన్నీ అబద్దాలు.. అబ్దుల్ బయటపెట్టిన అసలు నిజాలు

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా ‘విరూపాక్ష’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. తను యాక్సిడెంట్‌ నుంచి కోలుకున్న తర్వాత నటించిన మొదటి సినిమా ఇదే. అయితే 2021లో ప్రమాదం జరిగిన తర్వాత కాపాడిన వ్యక్తిని తాను కలిశానని ఇటీవల మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వెల్లడించారు. కానీ అవన్నీ అబద్దాలంటూ ఆ వ్యక్తి కొట్టిపారేశాడు.

Authored byసంతోష్ దామెర | Samayam Telugu 25 Apr 2023, 10:39 pm

ప్రధానాంశాలు:

  • సాయిధరమ్ నన్ను కలవలేదు: కాపాడిన వ్యక్తి
  • నెంబర్ ఇచ్చినట్లు ఇంటర్వ్యూలో తెలిపిన తేజ్
  • అవన్నీ అబద్దాలని పేర్కొన్న అబ్దుల్ ఫర్హాన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Abdul Farhan, Sai Dharam Tej
Sai Dharam Tej: అబ్దుల్, సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రస్తుతం ‘విరూపాక్ష’ (Virupaksha) మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. కార్తిక్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌గా హిట్ నిలిచింది. పైగా యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఇది తనకు కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. అయితే, ‘విరూపాక్ష’ ప్రమోషన్స్‌లో భాగంగా సాయిధరమ్.. యాక్సిడెంట్ జరిగినపుడు తనను కాపాడిన వ్యక్తిని గురించి మాట్లాడాడు. తేజ్‌ను కాపాడింది అబ్దుల్ ఫర్హాన్ (Abdul Farhan) అనే యువకుడు కాగా.. అతన్ని స్వయంగా కలిసినట్లు మెగా హీరో చెప్పాడు. ఫోన్ నంబర్ ఇచ్చానని, అతనికి ఏ అవసరమొచ్చినా అండగా ఉంటానని తెలిపాడు. ఈ వీడియో వైరల్ కాగా.. అతన్ని కాపాడిన వ్యక్తి మాత్రం అందులో ఏ మాత్రం నిజం లేదంటున్నాడు.
యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్‌ను కాపాడిన అబ్దుల్‌.. 2021లోనే సమయం తెలుగుతో తనకు ఎటువంటి సాయం అందలేదని చెప్పాడు. మెగా హీరోలు, వాళ్ల కుటుంబ సభ్యులు ఎవరూ తనతో మాట్లాడలేదన్నాడు. కానీ యూట్యూబ్ వీడియోల్లో రామ్ చరణ్ తనకు బండి ఇచ్చారని, చిరంజీవి రూ. 5 లక్షలు ఇచ్చారని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని తెలిపాడు. ఇదిలా ఉంటే, తాజాగా ‘విరూపాక్ష’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తేజ్ మాట్లాడుతూ.. అబ్దుల్‌ను కలిసి తన ఫోన్ నెంబర్ ఇచ్చానని, డబ్బు ఇఛ్చి అతని మానవత్వాన్ని వెలకట్టలేనని, కానీ ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అయితే సాయిధరమ్ తేజ్ వ్యాఖ్యలు అబ్దుల్ వరకు చేరడంతో అతను మరోసారి ఈ విషయంపై సమయం తెలుగుకు క్లారిటీ ఇచ్చాడు.

‘నేను కూడా ఆ వీడియో చూశాను. ఇప్పటి వరకు సాయిధరమ్ తేజ్ లేదా ఆయన టీమ్‌ ఎవరూ నన్ను కలవలేదు. నంబర్ కూడా ఇవ్వలేదు. అప్పుడు CMRలో పనిచేసేవాడిని. కానీ ఫేక్ న్యూస్ వల్ల అక్కడ టార్చర్ భరించలేకపోయా. చాలా మంది వచ్చిన నీకు డబ్బులు ఇచ్చారంట కదా అని అడుగుతుండటంతో జాబ్ మానేశా. ఆ తర్వాత నాలుగైదు నెలలు ఖాళీగా ఉన్నా. ఇప్పుడు అమెజాన్‌లో డ్రైవింగ్ చేస్తున్నా’ అని తెలిపాడు అబ్దుల్.

మొత్తానికి మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి కాల్ రాలేదని క్లారిటీ ఇచ్చిన అబ్దుల్.. యాక్సిడెంట్ జరిగిన టైమ్‌లో ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు. ‘ఆ రోజు నేను కేబుల్ బ్రిడ్జి నుంచి వస్తున్నా. అప్పుడే యాక్సిడెంట్ జరిగాక, హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. తర్వాత పోలీసులు, మీడియా నుంచి అనేక కాల్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే రిలేటివ్స్‌తో పాటు చాలా మంది నుంచి నాకు ఏమిచ్చారనే కాల్స్ ఎక్కువయ్యాయి. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల నాకు నష్టమే తప్ప లాభం ఏమీ జరగలేదు’ అని స్పష్టం చేశాడు.

చివరగా తను ఏం కోరుకుంటున్నాడో వెల్లడించాడు అబ్దుల్. సాయిధరమ్ తేజ్ కాల్ చేస్తే వెళ్లి కలుస్తానని చెప్పాడు. కానీ దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ మాత్రం స్ర్పెడ్ చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత తేజ్ నటించిన ‘విరూపాక్ష’ మూవీని తాను కూడా చూశానని, చాలా బాగుందని తెలిపాడు. మెగా ఫ్యామిలీకి తాను కూడా బిగ్ ఫ్యాన్ అని.. పిలిస్తే వెళ్లి కలవాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.


రచయిత గురించి
సంతోష్ దామెర
సంతోష్ దామెర సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, సినిమా, లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.