యాప్నగరం

బాలీవుడ్ నటి మమతా కుల్‌కర్ణికి షాక్‌

బాలీవుడ్‌ నటి మమతా కుల్‌కర్ణికి ఎన్డీపీఎస్ కోర్ట్ షాకిచ్చింది.

Samayam Telugu 27 Apr 2018, 10:33 am
బాలీవుడ్‌ నటి మమతా కుల్‌కర్ణికి ఎన్డీపీఎస్ కోర్ట్ షాకిచ్చింది. ముంబయిలో ఆమెకు చెందిన రూ.20 కోట్ల విలువైన మూడు ఫ్లాట్లను జప్తు చేసింది. రూ.2వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో పరారిలో ఉన్న ఆమె.. న్యాయస్థానానికి హాజరుకాకపోవడంతో ఎన్డీపీఎస్ న్యాయమూర్తి హెచ్.ఎం.పట్వర్థన్ ఈ ఆదేశాలిచ్చారు.
Samayam Telugu aaa


మమతా కులకర్ణి ప్రస్తుతం మాదకద్రవ్యాల స్మగ్లరు వికీగోస్వామితో కలసి కెన్యాలో ఉంటోంది. ఏప్రిల్‌ 2016లో మహారాష్ట్రలోని షోలాపుర్‌ జిల్లాలోని అవన్‌ లైఫ్‌సైన్సెస్‌ లిమిటెడ్‌ ఆవరణలో నిల్వ ఉంచిన 18.5 టన్నుల బరువు గల ఎఫిడ్రైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.2000 కోట్లు విలువ చేసే ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ఆమె సహకరించిందని పోలీసుల ఆరోపణ. ఈ కేసు విచారణ కోసం ఆమెను కెన్యా నుంచి ఇండియాకు రప్పించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.