యాప్నగరం

పర్సనల్ స్టాఫ్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన హీరో అఖిల్

అక్కినేని నాగార్జున, నాగచైతన్య తమ వ్యక్తిగత సిబ్బంది సంతోషం కోసం వారి ఇళ్లల్లో వేడుకలకు హాజరై సర్‌ప్రైజ్ చేస్తుంటారు. తాజాగా అక్కినేని అఖిల్ ఓ శుభకార్యానికి హాజరయ్యాడు.

Samayam Telugu 19 Jan 2019, 1:38 am
వ్యక్తిగత సిబ్బందిపై కొందరు సెలబ్రిటీలు చిరాకు పడుతుంటారు. మరికొందరు వారికి తగిన గౌరవ మర్యాదలు ఇస్తూ నడుచుకుంటారు. సిబ్బంది ఇంట్లో శుభకార్యాలకు హాజరై వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుంటారు. తాజాగా అక్కినేని వారసుడు అఖిల్ తన వ్యక్తిగత సిబ్బంది వివాహానికి హాజరయ్యాడు.
Samayam Telugu Akhil1


అఖిల్ వ్యక్తిగత సిబ్బందిలో ఒకడైన మోసెస్ వివాహం తూర్పు గోదావరి జిల్లా కడియంలో జరిగింది. ఈ శుభకార్యానికి నటుడు అఖిల్ హాజరయ్యాడు. నూతన వధూవరులను ఆశీర్వదించి, ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అఖిల్ రావడంతో మోసెస్ కుటుంబసభ్యులు ఫుల్ హ్యాపీ. నాగార్జున, నాగచైతన్య సైతం ఇలా తమ వ్యక్తిగత సిబ్బంది సంతోషం కోసం వారి ఇళ్లల్లో వేడుకలకు హాజరై సర్‌ప్రైజ్ చేస్తుంటారు.

కాగా, మరోవైపు శనివారం (జనవరి 19న) అఖిల్ తాజా మూవీ మిస్టర్ మజ్ను ప్రి రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. బిజీ షెడ్యూళ్స్‌తో ఉన్నప్పటికీ అఖిల్ తన పర్సనల్ స్టాఫ్ మ్యారేజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ప్రి రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.