యాప్నగరం

Jr NTR వీరాభిమాని మృతి.. నెరవేరని తారక్ కోరిక

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్ మృతిచెందాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆయన కోమాలోకి వెళ్లాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకోవాలని ఎన్టీఆర్‌తో పాటు అభిమానులు కూడా ప్రార్థించారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 6 Jul 2022, 7:57 am
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) వీరాభిమాని జనార్ధన్ మృతిచెందాడు. ఏపీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన అతను.. ఇటీవలె రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లాడు. గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న జనార్ధన్.. కోలుకోలేక మంగళవారం సాయంత్రం ప్రాణాలు విడిచాడు. అతను కోలుకోవాలని ఎన్టీఆర్‌తో పాటు అభిమానులు కూడా ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడిన తారక్.. ధైర్యంగా ఉండాలని భరోసా కూడా ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తూ జనార్ధన్ కోలుకోలేకపోయాడు.
Samayam Telugu జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మృతి


ఇటీవలె జనార్ధన్ తల్లితో ఎన్టీఆర్ మాట్లాడారు. దేవుడిని నమ్మండని.. అధైర్యపడొద్దని చెప్పారు. అదేవిధంగా అతని దగ్గర ఫోన్ పెట్టాలని చెప్పిన తారక్.. 'జనార్ధన్.. నేను ఎన్టీఆర్‌ను మాట్లాడుతున్నా.. నీకేం కాదు. నీకు నేను ఉన్నా.. మన అభిమానులు ఉన్నారు. నువ్వు త్వరగా కోలుకుని వస్తే మనం కలుద్దాం. నీ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నా. దేవుడిని నమ్మండి. ఏం కాదు. నువ్వు కోలుకోవాలని నేను, అభిమానులు ప్రార్థిస్తాం. అధైర్యపడవద్దు..' అని భరోసా ఇచ్చారు.

View this post on Instagram A post shared by Jr NTR Fans™ (@jrntrfans55)

జనార్ధన్‌తో ఎన్టీఆర్ మాట్లాడినప్పుడు అతను స్పందించాడని.. వేళ్లు కదిలాయని అక్కడ ఉన్నవాళ్లు చెప్పారు. ఆ అభిమానితో ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో ఇటీవలె సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. జనార్ధన్‌ మృతి పట్ల అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.