యాప్నగరం

Krishnam Raju నన్ను ఫస్ట్ టైమ్ బెంజ్ కారు ఎక్కించారు.. ఒరేయ్ అని పిలిచే వ్యక్తి ఆయనే: మోహన్ బాబు ఎమోషనల్

రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju)తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నటుడు మోహన్ బాబు (Mohan Babu). ఆయన వల్లే తాను తొలిసారి బెంజ్ కారు ఎక్కానని అన్నారు. ఒరేయ్ అని ఆప్యాయంగా పిలిచేవారని చెప్పారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 14 Sep 2022, 8:20 am
రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) తొలిసారి తనను బెంజ్ కారు ఎక్కించారని నటుడు మోహన్ బాబు (Mohan Babu) గుర్తుచేసుకున్నారు. ఫిల్మ్ నగర్‌లో మంగళవారం కృష్ణంరాజు సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. కృష్ణంరాజు‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ''గతంలో నేను ఎవరి సంతాప సభలకు హాజరుకాలేదు. మనిషి లేనప్పుడు ఏమి సంతాపం.. ఎవరి కోసం.. పోయిన వ్యక్తి తిరిగి వస్తాడా..? ఈ బాధ కుటుంబానికే కాదు. అతి సన్నిహితంగా ఉన్న వాళ్లకు ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది.
Samayam Telugu Mohan Babu on Krishnam Raju
మోహన్ బాబు


కృష్ణం రాజు గారి చెప్పేందుకు చాలా ఉంది. ఆయన సీనియర్ నా నటులు. ఒరేయ్ అని ఆప్యాయంగా పిలిచే వ్యక్తి. నేను సరదాగా గట్టిగా మాట్లాడితే.. 'ఏంట్రా మాట్లాడుతున్నావు.. రా రా.. భోజనం చేసి వెళ్లు..' అని అనేవారు. మా ఇద్దరి అనుబంధం ఎంతో ఉంది. అది చెప్పాలనుకోవట్లేదు. నటుడిగా ఫస్ట్ టైమ్ నన్ను బెంజ్ వ్యక్తి ఎక్కించిన వ్యక్తి ఆయన. ఆయన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అవన్నీ పెద్ద పుస్తకంలా ఉంటాయి. గొప్ప నిర్మాతను, గొప్ప నటుడిని మనం కోల్పోయాం. ఆయన ఎక్కడ ఉన్నా.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని సకల దేవతలను కోరుకుంటున్నా..'' అంటూ మాట్లాడారు.

'దాసరి నారాయణ గారి తరువాత తాను అంతగా పెద్దరికంగా చూసింది కృష్ణంరాజు అంకుల్‌నే.. నేను ఆయన వల్లే మా అసోషియేషన్‌కు ప్రెసిడెంట్‌గా పోటీ చేశాను. మా నాన్న గారు వద్దన్నా.. దబాయించి మరి పోటీ చేసేలా ఒప్పించారు. ఆయనో లెజెండ్. భౌతికంగా మన మధ్యలో లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు, సినిమాలతో చిరకాలం మనతోనే ఉంటారు..' అని మంచు విష్టు అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.