యాప్నగరం

నర్సింగ్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన నరేష్.. 25 ఏళ్లుగా పరిచయమంటూ ఎమోషనల్ కామెంట్స్

సినీ నటుడు నర్సింగ్ యాదవ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు 'మా' ప్రెసిడెంట్ నరేష్. ఆ కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Samayam Telugu 12 Jan 2021, 2:12 pm
వందలాది సినిమాల్లో నటించి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020 డిసెంబర్ 31న ఆయన మరణించారు. ఏడాది కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆయన మృతి చెందారని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు (జనవరి 12) స్వయంగా నర్సింగ్ యాదవ్ ఇంటికి వెళ్లి ఆయన భార్యను, కుమారుడిని పరామర్శించారు 'మా' ప్రెసిడెంట్ నరేష్.
Samayam Telugu 25 ఏళ్లుగా నర్సింగ్ యాదవ్ పరిచయం.. ఇండస్ట్రీలో ఆయనది ట్రేడ్ మార్క్: నరేష్
Narsing Yadav Naresh


ఈ సందర్భంగా నర్సింగ్ యాదవ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తన బాధను వ్యక్తం చేశారు నరేష్. నర్సింగ్ యాదవ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నమస్కారం చెప్పాక నరేష్ మాట్లాడుతూ.. ''శ్రీ నర్సింగ్ యాదవ్ మంచి మనిషి. ప్రఖ్యాత నటుడు. సినీ ఇండస్ట్రీలో తన ట్రేడ్ సృష్టించిన ఆయన మన మధ్య లేకపోవడం విచారకరం. ఆయన ఈ లోకం విడిచి వెళ్లడం దురదృష్టకరంగా భావిస్తున్నాం. 25 ఏళ్లుగా నర్సింగ్ యాదవ్ నాకు పరిచయం. 'మా'లో యాక్టివ్ మెంబర్‌గా ఎన్నో సేవలు చేశారు.
ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత
నర్సింగ్ యాదవ్ కుటుంబం కూడా చాలా ఆప్తులు నాకు. నేను అవుట్ డోర్ షూటింగ్‌లో ఉన్నందున మొన్న దినానికి రాలేకపోయాను. అందుకే షూటింగ్ ముగియగానే వెంటనే వచ్చి నర్సింగ్ యాదవ్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాను. నర్సింగ్ యాదవ్ ఎంతో మంచి మనిషి, ఆయనది చిన్న పిలాడి మనస్తత్వం. ఆయన కుటుంబానికి ఎల్లపుడూ నా సపోర్ట్ ఉంటుంది'' అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.