యాప్నగరం

ప్రకాశ్ రాజ్ కష్టాలకు అక్షర రూపం ‘దోసిటి చినుకులు’

నటుడు, దర్శకుడు ప్రకాశ్ రాజ్ తన కష్టాలకు అక్షర రూపం ఇచ్చారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

Samayam Telugu 24 Dec 2018, 7:33 pm
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన‌ జీవితంలో ఎదురైన సమస్యలు, వాటికి సంబంధించి ఆయనకు తోచిన పరిష్కారాలకు అక్షర రూపం ఇచ్చారు. వాటిని ‘దోసిటి చినుకులు’ పేరుతో పుస్తకంగా ఆవిష్కరించారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న 32వ జాతీయ పుస్తక ప్రదర్శన ఇందుకు వేదికైంది. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.
Samayam Telugu book


సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి, ఆలిండియా బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్‌తో కలిసి ప్రకాశ్‌ రాజ్‌ తాను రాసిన ‘దోసిటి చినుకులు’ పుస్కకాన్ని ఆవిష్కరించారు. కన్నడలో ‘ఇరువుదెల్లవ బిట్టు’ పేరుతో దీన్ని ఈ ఏడాది (2018) ఫిబ్రవరిలోనే విడుదల చేశారు.

ప్రకాశ్‌ రాజ్‌ గొప్ప నటుడు మాత్రమే కాదు.. గొప్ప రచయిత అని జూలూరి గౌరీశంకర్ ప్రశంసించారు. మంచి నటుడు మంచి దర్శకుడు అవ్వడం అరుదని తనికెళ్ల భరణి అన్నారు. ప్రకాశ్‌ రాజ్‌ రాసిన దోసిట చినుకులు.. దోసిట తేనె లాంటి పుస్తకమని తనికెళ్ల భరణి చమత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ దర్శకుడు కృష్ణవంశీ, ఓలేటి పార్వతీశం తదితరులు పాల్గొన్నారు.

పుస్తక ప్రదర్శనకు విశేష స్పందన
చారిత్రక హైదరాబాద్‌లో ఏటా జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శన నిర్వహించే విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 32వ నేషనల్ బుక్ ఫెయిర్‌కు పాఠకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ పుస్తక ప్రదర్శనను డిసెంబర్ 15న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. మంగళవారం (డిసెంబర్ 25)తో ఈ పుస్తక ప్రదర్శన ముగియనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.