సినీ ఇండస్ట్రీని విషాదాలు ఇంకా వీడడం లేదు. తాజాగా మరో ప్రముఖ నటుడు ప్రతాప్ పోతెన్ (Prathap Pothen) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆయన వయసు 70. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా డైరెక్టర్గా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
తెలుగులో ఆకలి రాజ్యం, కాంచన గంగ, జస్టిస్ చక్రవర్తి, మరోచరిత్ర వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఆయన అన్ని భాషల్లో కలిపి వందకుపైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. సీనియర్ నటి రాధికను 1985 ప్రతాప్ పెళ్లి చేసుకున్నారు. అయితే 1986 వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తరువాత 1990లో అమలా సత్యనాథ్ను రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కూడా 2012 లో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఓ కుమార్తె ఉంది.
ప్రతాప్ పోతెన్ చివరగా CBI5 ది బ్రెయిన్లో సినిమాలో నటించారు. 1985 రిలీజ్ అయిన ఒరు కాతల్ కథై చిత్రానికి బెస్ట్ డైరెక్టర్గా ఆయన నేషనల్ అవార్డు వచ్చింది. అదే చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డ్ కూడా ఆయనను వరించింది.