యాప్నగరం

అమ్మ మాటలు కదిలించాయి.. అందుకే నటుడినయ్యా: రావు రమేష్

దర్శకుడిగా సినిమాల్లోకి రావాలనుకున్న తనను తల్లి మాటలు కదిలించాయని, అందుకే నటుడిని అయ్యానని చెప్పారు రావు రమేష్. ‘సీమ సింహం’ సినిమాతో ఆయన టాలీవుడ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 28 Nov 2020, 8:18 pm
తన విలనిజంతో ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు రావు గోపాలరావు. తండ్రిని మించిన కొడుకుగా ఇప్పుడు రావు రమేష్ అంతకంటే ఎక్కువగానే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. విలనిజంతో పాటు కామెడీ, సెంటిమెంట్‌ పాత్రలను అద్భుతంగా పండిస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘సీమసింహం’తో టాలీవుడ్‌కి పరిచయమైన రమేష్‌కు... ‘కొత్త బంగారు లోకం’, ‘గమ్యం’ సినిమాలు బ్రేక్ ఇచ్చాయి.
Samayam Telugu రావు రమేష్


Also Read: కీర్తి సురేష్ తల్లి కూడా స్టార్ హీరోయినే.. చిరంజీవితో బ్లాక్‌బస్టర్‌ మూవీ..

అయితే రావు రమేష్‌కు అసలు నటన అంటే ఆసక్తి లేదంటే నమ్మగలమా. అవును ఇండస్ట్రీకి రాకముందు రమేష్‌ దర్శకుడు అవుదామనుకున్నారట. ఇదే విషయాన్ని తల్లికి చెప్పగా.. ‘డైరెక్టర్ కావాలంటే లెన్స్ తెలిస్తే సరిపోదు.. 24 విభాగాలపైనా పట్టు ఉండాలి, జీవితం తెలియాలి. ముళ్ల బాట దాటుకుని వెళ్లిన తర్వాతే వెలుగు కనిపిస్తుంది. ముందు నటుడిగా నిరూపించుకో’ అని చెప్పారంట. తల్లి చెప్పిన మాటలతో మనసు మర్చుకున్న రావు రమేష్‌ డైరెక్షన్ ఆలోచనను పక్కన పెట్టి నటుడయ్యారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు.

Also Read: హీరో రాజశేఖర్ తన రెండిళ్లను అమ్ముకున్నారట.. ఇందులో నిజమెంత?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.