యాప్నగరం

గొప్ప మనసు చాటుకున్న సంపూర్ణేష్ బాబు

తొలి సినిమాతోనే బర్నింగ్ స్టార్‌గా పేరు గాంచిన సంపూర్ణేష్ బాబు తిత్లీ తుఫాన్ బాధితుల పట్ల తన గొప్ప మనసు చాటుకున్నారు.

Samayam Telugu 14 Oct 2018, 7:52 pm
ఉత్తరాంధ్రలో తిత్లీ తుఫాన్‌ పెను విధ్వంసం సృష్టించడంతో జన జీవనం అస్తవ్యవస్తమైంది. ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం జరిగింది. సాయం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టినా కేవలం రాష్ట్ర ప్రభుత్వమే అన్ని చేయలేదని బాబు పేర్కొన్నారు. మరోవైపు తొలి సినిమాతోనే బర్నింగ్ స్టార్‌గా పేరు గాంచిన సంపూర్ణేష్ బాబు తిత్లీ తుఫాన్ బాధితుల పట్ల తన గొప్ప మనసు చాటుకున్నారు.
Samayam Telugu Sampoornesh Babu


‘శ్రీకాకుళం జిల్లా #CycloneTitli వల్ల చాలా నష్టం జరిగింది అని స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. వెంటనే మన వంతు సాయంగా చర్యలు చేపట్టాలని అన్ని వర్గాల ప్రజలను కోరుకుంటున్నాను. నా వంతుగా Rs.50,000/- ఆర్థిక సాయం ముఖ్యమంత్రి గారి సహాయనిధి కి అందజేస్తాను’ #SaveSrikakulam అనే ట్యాగ్‌తో సంపూర్ణేష్ ట్వీట్ చేశారు. తెలంగాణ పౌరుడు అయినప్పటికీ.. గతంలో ఏపీకి వెళ్లి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొని వారికి మద్దతు తెలిపారు హీరో సంపూర్ణేష్.
ఇతర రాష్ట్రాల్లో వరదలు, ఉప్పెనలు సంభవించగానే సోషల్ మీడియాలో సేవ్ కేరళ, సేవ్ తమిళనాడు అంటూ ట్వీట్లు, పోస్టులు చేసే టాలీవుడ్ ప్రముఖుల కంటికి ఏపీలో తలెత్తిన విపత్తు కనిపించలేదా అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. తిత్లీ బాధితులకు సాయం కోసం తాను రూ.50 వేలు అందజేస్తానని ప్రకటించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. తాను కేవలం రిల్ హీరోగానే కాదు తాను రియల్ హీరో అని సంపూ నిరూపించుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన వంతు సాయం ప్రకటించడంతో సాధ్యమైనంత మేర సాయం చేద్దామంటూ పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.