యాప్నగరం

ఆ ఘటన చూసి షాక్ అయ్యా.. చాలా పెద్ద క్రైమ్: సోనూసూద్

హైదరాబాద్‌లొని జూబ్లీహిల్స్ మైనర్ బాలిక‌పై సామూహిక అత్యాచార ఘటనపై నటుడు సోనూసూద్ స్పందించారు. ఈ ఘటనను చూసి వార్తల్లో చూసి షాక్ అయ్యాయనని చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 14 Jun 2022, 3:27 pm

ప్రధానాంశాలు:

  • జూబ్లీహిల్స్ పబ్ ఘటనపై సోనూసూద్ స్పందన
  • మనం ఆలోచించే విధానంలో ఉంటుంది
  • నిందితులను కఠినంగా శిక్షించాలి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu సోనూసూద్
హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక‌పై సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అమ్నీషియా పబ్‌ వద్ద బాలికకు మాయమాటలు చెప్పిన నిందితులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి తెగబడ్డారు. ఈ ఘటనకు పాల్పడ్డ కామంధులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్‌లోకి తీసుకుని విచారణ చేపట్టిన పోలీసుల.. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌‌ చేసి మరింత లోతుగా ఎంక్వరీ చేస్తున్నారు. నిందితులను కఠిన శిక్షించాలని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ఈ ఘటనపై రియాల్ హీరో, నటుడు సోనూసూద్ స్పందించారు. తాను ఈ ఘటనను న్యూస్‌లో చూసి షాక్ అయ్యాయనని.. ఇది చాలా పెద్ద క్రైమ్ అని అన్నారు. ఇలాంటి ఘటనలకు కేవలం పబ్‌లే కారణమవుతున్నాయని చెప్పడం సరికాదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని.. మనం ఆలోచించే విధానంలో ఉంటుందన్నారు.

'మనం చూసే పద్ధతి తప్పుగా ఉంటే.. తప్పుడు ఆలోచనలే వస్తాయి. జూబ్లీహిల్స్ ఘటనలో తప్పు మైనర్లు చేశారా.. మేజర్లు చేశారా అనేది కాదు.. ఎలాంటి క్రైమ్ చేశారనేది చూడాలి. ఘటనకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి..' అని సోనూసూద్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.