యాప్నగరం

‘గజ’ రిలీఫ్: సూర్య కుటుంబం రూ.50 లక్షల సాయం

తుఫానుల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో బాధితుల సహాయార్థం సినీ తారలు విరాళాలు ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. కేరళ వరదలు, తిత్లీ తుఫాన్ సమయంలో చాలా మంది తమిళ, తెలుగు సినీ తారలు విరాళాలు ఇచ్చారు.

Samayam Telugu 19 Nov 2018, 3:37 pm
ఉత్తర భారతదేశాన్ని తుఫానులు, వరదలు వణికిస్తున్నాయి. మూడు నెలల క్రితం కేరళను భారీ వరదలు ముంచెత్తాయి. కేరళలోని 7 జిల్లాలు ఈ వరదలకు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. నెల రోజుల క్రితం తిత్లీ తుఫాన్ ఉత్తరాంధ్రను వణికించింది. తాజాగా గజ తుఫాన్ తమిళనాడులోని దక్షిణ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఈ తుఫాన్ కారణంగా డెల్టా ప్రాంతమంతా తుడుచుపెట్టుకు పోయింది.
Samayam Telugu Suriya


ఇదిలా ఉంటే, తుఫానుల కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో బాధితుల సహాయార్థం సినీ తారలు విరాళాలు ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. కేరళ వరదలు, తిత్లీ తుఫాన్ సమయంలో చాలా మంది తమిళ, తెలుగు సినీ తారలు విరాళాలు ఇచ్చారు. కేరళ రాష్ట్రానికైతే తొలిసారిగా హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తి స్పందించి విరాళాలు అందజేశారు. ఇప్పుడు తమిళనాడుకు సైతం వీరే ముందుగా స్పందించి సాయం అందించారు. గజ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి సూర్య కుటుంబం రూ.50 లక్షల విరాళం అందజేసింది.

శివకుమార్, సూర్య, కార్తి, జ్యోతిక, 2డి ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మొత్తం రూ.50 లక్షలను ఎన్జీవోల ద్వారా బాధితుల సహాయార్థం ఖర్చు చేయనున్నారు. ఈ విషయాన్ని సూర్య ప్రాణ స్నేహితుడు, 2డి ఎంటర్‌టైన్మెంట్ బాధ్యతలు చూసుకుంటోన్న రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ తెలియజేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.