వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ సినీ నటుడు 30 ఇయర్స్ పృథ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్గా నియమించారు. అయితే ఛానల్ ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు రావడం.. ఓ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో వివాదం రేగింది. ఆయన్ను ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ వినిపించింది. ప్రజా, మహిళా సంఘాలు ధర్నాలు చేశాయి. ఆడియోటేపు వ్యవహారం.. తనపై ఆరోపణలు రావడంతో.. పృథ్వీరాజ్ తన పదవికి రాజీనామా చేశారు. వైరల్గా మారిన తన ఆడియో టేప్ గురించి పృథ్వీ షాకింగ్ విషయాలు వెల్లడించారు. అసలు ఏం జరిగిందో వెల్లడిస్తూ.. మొత్తానికి అనుమానించిన వారే ఈ పని చేసారని అన్నారు.
Samayam Telugu29 Feb 2020, 1:17 pm
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ సినీ నటుడు 30 ఇయర్స్ పృథ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్గా నియమించారు. అయితే ఛానల్ ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు రావడం.. ఓ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో వివాదం రేగింది. ఆయన్ను ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ వినిపించింది. ప్రజా, మహిళా సంఘాలు ధర్నాలు చేశాయి. ఆడియోటేపు వ్యవహారం.. తనపై ఆరోపణలు రావడంతో.. పృథ్వీరాజ్ తన పదవికి రాజీనామా చేశారు. వైరల్గా మారిన తన ఆడియో టేప్ గురించి పృథ్వీ షాకింగ్ విషయాలు వెల్లడించారు. అసలు ఏం జరిగిందో వెల్లడిస్తూ.. మొత్తానికి అనుమానించిన వారే ఈ పని చేసారని అన్నారు.
నాకు ఎస్వీబీసీ ఇచ్చిన గిఫ్ట్ ఇది
‘‘నా చేతికి కట్టు ఎస్వీబీసీ ఇచ్చిన గిఫ్ట్. జరిగిన సంఘటనల పట్ల నేను మానసికంగా దెబ్బతిని ఉన్నాను. నన్ను ఒక్కరు కూడా వచ్చి పలకరించలేదు. నన్ను ఉగ్రవాదిగా చిత్రీకరించారు. నేను మానసికంగా డిస్టర్బ్ అయిపోయి చెట్లకు నీళ్లుపోస్తున్నప్పుడు కిందపడ్డాను. చెయ్యి విరిగింది. ఇదివరకు పార్టీలో ఉన్నప్పుడు వైసీపీ వారి గురించి ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఏమన్నా కూడా నేను వారిపై అరిచేసేవాడిని. నాకు ఇంతవరకే తెలుసు. నాకు రాజకీయాలు తెలీవు’’
నెలలు నిండకుండానే అబార్షన్ చేసారు
‘‘జగన్మోహన్ రెడ్డిగారు వంద శాతం ఒక కరెక్ట్ రూటులో వెళ్తున్నారు. లంచగొండితనం వద్దు అన్న నియమం పెట్టుకున్నారు. ఆ బాటలో నేను ఒక్క పర్సెంట్ చేయగలగాలి అనుకున్నాను. నాకు ఆయన పాలన టెక్నిక్స్ తెలుసుకోవడానికి మూడు నెలలు పట్టింది. అప్పటికి నేను ఎస్వీబీసీ ఛైర్మన్గా ఐదు నెలలు ఉన్నాను. తొమ్మిది నెలల్లో డెలివరీ అంటే అబార్షన్ చేసినట్లు నన్ను ఐదు నెలల్లే తీసి పడేసారు. ఎస్వీబీసీ గ్రౌండ్స్లో నేను క్రికెట్ ఆడేందుకు వెళ్లేవాడిని. నేను ఆ పరిసరాలకు వెళ్తే ఏంటండీ ఎస్వీబీసీలో ఏవేవో రాజకీయాలు జరుగుతున్నాయట అని అడిగేవారు. అప్పుడు నేను ఒక్కటే చెప్పాను. నేను వచ్చాక ఎస్వీబీసీలో ఇలాంటి జరగవు అని’’
మీడియా వర్గాలు అప్పుడే హెచ్చరించారు
‘‘ఎస్వీబీసీ ఛైర్మన్గా ఉన్నప్పుడు నేను పలు ప్రెస్మీట్లు పెట్టాను. మీడియా వాళ్లు నన్ను హెచ్చరించారు. తిరుపతిలో రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలీవు సర్ అనేవారు. నాకు అప్పుడు అర్థం అయ్యేది కాదు. జగన్ అన్న జెండాతో ఏపీ మొత్తం తిరిగాం. అక్కడంతా లేని రాజకీయం తిరుపతిలో ఏముంటుంది అనుకున్నాను. ఏ కోణంగా ఆలోచించినా కూడా ఓ మనిషి కడుపు మీద కొట్టకూడదు. దెబ్బకు కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయింది. రోడ్డు మీదకు వచ్చేసాను. పార్టీలో చెడ్డపేరు తీసుకొచ్చారు. సినిమా రంగంలో మాట్లాడేవారు కూడా పలకరించడంలేదు’’
నేను రైతులను ఏమీ అనలేదు
‘‘ఆ ఆడియో కాల్లో మహిళ గురించి ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు. మొన్న ఒంగోలు వెళ్లినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను. మూడు రాజధానులపై మాట్లాడాను. రైతుల ఇబ్బందుల గురించి కూడా మాట్లాడాలను. వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తు్న్నాను నేను రైతుల గురించి ఏమీ అనలేదు. రైతు ఉద్యమంలో ఉన్న కార్పొరేట్ రైతుల గురించి మాట్లాడాను. వాళ్లను పెయిడ్ ఆర్టి్స్ట్లు అన్నాను. నేను రైతుల గురించి తప్పుగా మాట్లాడి ఉంటే.. అదే రైతులు నన్ను తిట్టేవారు కదా. కానీ మీరు మా గురించి 2014 నుంచే మాట్లాడుతున్నారు అంటూ రైతులే నాతో అన్నారు. నేను అన్న మాటలను ఓ ఛానెల్కు సంబంధించిన వ్యక్తి వక్రీకరించి నా గురించి తప్పు తప్పుగా ప్రచారం చేసేసాడు. నన్ను చెత్తనాకొడకా అన్నాడు. నాకు వెన్నుపోటు పొడుస్తారు అని అప్పుడే నాకు అర్థమైపోయింది. నాపై పోసాని గారు ఎందుకు కోపడ్డారో తెలీలేదు. నాకు ఆయనకు ఎలాంటి గొడవలు లేవు. అలాంటి గొడవలు క్రియేట్ చేసారు. నా ఫ్లెక్సీలు తగలబెట్టారు. అన్నీ ప్లాన్ చేసుకున్నట్లే చేసారు’’
శృంగారలీలలు అని పేరు పెట్టేసారు
‘‘నాకు ఇవన్నీ చేసినందుకు బాధ లేదు. కానీ నాపై శృంగారలీలలు అని పేరు పెట్టేసారు. నాపేరును చెడగొట్టడానికి కొన్ని లక్షలకు ఖర్చుపెట్టారట. మొన్న కాలినడకన వెళ్లినప్పుడు అక్కడి పూజారులు ఒకే మాట అన్నారు. ‘మీకు స్వామి దర్శనం బాగా జరిగింది. ఆయన మీకు కొన్ని రోజులు సెలవు ప్రకటించారు. ఈ గ్యాప్లో మీ చుట్టూ ఎవరు ఎలాంటి వాళ్లో తెలుసుకోండి. అంతా మంచే జరుగుతుంది’ అన్నారు. నేను అసలు కానుకలు ఆశించేవాడిని కాను’’
పదవి పోయాక ఎవరు ఎలాంటివాళ్లో తెలిసింది
‘‘ఓసారి నా స్నేహితుడు నాకు ఓ యాపిల్ ల్యాప్టాప్ కొనిచ్చాడు. నాతో బాగానే మాట్లాడేవాడు. కానీ ఎప్పుడైతే నాపై ఈ ఆడియో టేపులు, కేసులు పెట్టి నన్ను పదవి నుంచి తప్పించారో అతను ఇంటికి వచ్చి ఇచ్చిన కానుకను తీసుకుని వెళ్లిపోయాడు. అలా ఉన్నారు నా చుట్టూ మనుషులు. నేను ఎవరి వల్లైతే నా పదవి పోతుంది అనుకున్నానో వారి వల్లే పోయింది. అయితే ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇదేమీ లంచం తీసుకునే పని కాదు కదా. అలాంటి పనులు నేను చేయను. అలాంటప్పుడు నేను ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నాకు వైసీపీలో కానీ ఎస్వీబీసీలో కానీ ఎలాంటి శత్రువులు లేరు. ఏదైతేనేంటి.. స్వామి ఆశీస్సులతో నాపై పడిన నింద పోతుందనే అనుకుంటున్నాను’’ అని తెలిపారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.