యాప్నగరం

కేరళ రెస్క్యూ: విశాల్ పిలుపు.. సూర్య, కార్తీ రూ.25 లక్షల విరాళం

వరద బీభత్సం కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. నదులు, డ్యాంలు ఉప్పొంగి ప్రవహించడంతో వందలాది నగరాలు, పట్టణాలు నీటమునిగాయి.

Samayam Telugu 11 Aug 2018, 8:44 pm
వరద బీభత్సం కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుంది. నదులు, డ్యాంలు ఉప్పొంగి ప్రవహించడంతో వందలాది నగరాలు, పట్టణాలు నీటమునిగాయి. గత మూడు రోజులుగా కురుస్తు‍న్న భారీ వర్షాలకు అక్కడి జనజీవనాన్ని స్ధంభింప చేశాయి. కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడటంతో దాదాపు 29మంది మృత్యువాత పడ్డారు. దీంతో 26 సంవత్సరాల తరువాత మొదటి సారి ఇడుక్కి డ్యామ్‌ గేట్లను తెరిచినట్టు అధికారులు ప్రకటించారు. కేరళలోని 14 జిల్లాలకు గాను 7 జిల్లాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇళ్లల్లోకి వరద నీరు ముంచెత్తడంతో సుమారు 54,000 మంది నిరాశ్రయులయ్యారు.
Samayam Telugu కేరళ


దీంతో పొరుగున ఉన్న తమిళ ఇండస్ట్రీ హీరోలు మేమున్నాం అంటూ ముందుకు వచ్చారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్.. వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న కేరళ ప్రజల్ని ఆదుకునేందుకు ‘కేరళ రెస్క్యూ’ పేరుతో విరాళాలు సేకరణకు నడుం బిగించారు. ట్విట్టర్‌లో విశాల్ ఇచ్చిన పిలుపు మేరకు తమిళ హీరోలు కార్తీ, సూర్య స్పందించారు.
రూ. 25 లక్షల భారీ విరాళం..
‘కేరళ రెస్క్యూ' పేరుతో విరాళాలు సేకరణ నిమిత్తం సూర్య, కార్తీ బ్రదర్స్ తమ వంతుగా రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇటీవల సొంత రాష్ట్రమైన తమిళనాడు రైతులకోసం రూ. కోటి విరాళం ఇచ్చిన సూర్య, కార్తీ బ్రదర్స్.. పొరుగు రాష్ట్రమైన కేరళకు సాయం చేసేందుకు రూ. 25 లక్షల విరాళం ప్రకటించడంతో సోషల్ మీడియాలో వీరిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.