జనం ఇళ్లల్లో.. పోలీసులు రోడ్లపైన. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోడ్లపై గస్తీ కాస్తూ బోర్డర్లో సైనికుల మాదిరి యుద్ధం చేస్తున్నారు. దారుణం ఏంటంటే ‘బతికి ఉంటే బటానీలైనా అమ్ముకుని తినొచ్చురా నాయనా.. ముందు ఇంటి నుంచి బయటకు రాకండి.. వచ్చే చస్తారు. మీతో పాటు మీ ఇంట్లో వాళ్లు.. ఆ తరువాత పక్కనున్న వాళ్లు.. ఇలా రాష్ట్రం, దేశం మొత్తం కరోనాతో తగలబడిపోతుంది. దయచేసి బయటకు రాకండి’ అని సాక్ష్యాత్తు సీఎంలో ప్రెస్ మీట్లు నిర్వహించి దండాలు పెట్టి వేడుకుంటున్నా జనం రోడ్లపై కనిపిస్తూనే ఉన్నారు. అయితే అత్యవసరం అయినప్పుడు వస్తే సరిసరే.. చాలా మంది యువకులు రోడ్లపై షికార్ చేస్తూ, గ్రౌండ్లో ఆటలాడుకుంటూ వ్యాధి తీవ్రతను గ్రహించక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. టీవీల్లో, సమాచార మాధ్యమాల్లో ఈ వ్యాధి తీవ్రత గురించి 24 గంటలు చెప్తున్నా పెడచెవిన పెడతున్నారు. గ్రూపులు గ్రూపులుగా రోడ్లపై తిరుగుతూ ఎంత వద్దన్నా విందులు, వినోదాల్లో పాల్గొంటూనే ఉన్నారు. కనీసం గుడిలు, మసీదులు, చర్చ్లు సైతం నిర్వహించకూడదని ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వీళ్లు మాత్రం ఏం పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
Samayam Telugu28 Mar 2020, 9:18 am
జనం ఇళ్లల్లో.. పోలీసులు రోడ్లపైన. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రోడ్లపై గస్తీ కాస్తూ బోర్డర్లో సైనికుల మాదిరి యుద్ధం చేస్తున్నారు. దారుణం ఏంటంటే ‘బతికి ఉంటే బటానీలైనా అమ్ముకుని తినొచ్చురా నాయనా.. ముందు ఇంటి నుంచి బయటకు రాకండి.. వచ్చే చస్తారు. మీతో పాటు మీ ఇంట్లో వాళ్లు.. ఆ తరువాత పక్కనున్న వాళ్లు.. ఇలా రాష్ట్రం, దేశం మొత్తం కరోనాతో తగలబడిపోతుంది. దయచేసి బయటకు రాకండి’ అని సాక్ష్యాత్తు సీఎంలో ప్రెస్ మీట్లు నిర్వహించి దండాలు పెట్టి వేడుకుంటున్నా జనం రోడ్లపై కనిపిస్తూనే ఉన్నారు. అయితే అత్యవసరం అయినప్పుడు వస్తే సరిసరే.. చాలా మంది యువకులు రోడ్లపై షికార్ చేస్తూ, గ్రౌండ్లో ఆటలాడుకుంటూ వ్యాధి తీవ్రతను గ్రహించక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. టీవీల్లో, సమాచార మాధ్యమాల్లో ఈ వ్యాధి తీవ్రత గురించి 24 గంటలు చెప్తున్నా పెడచెవిన పెడతున్నారు. గ్రూపులు గ్రూపులుగా రోడ్లపై తిరుగుతూ ఎంత వద్దన్నా విందులు, వినోదాల్లో పాల్గొంటూనే ఉన్నారు. కనీసం గుడిలు, మసీదులు, చర్చ్లు సైతం నిర్వహించకూడదని ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వీళ్లు మాత్రం ఏం పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
‘కనిపిస్తే ఉతుకుడు’ అనే కొత్త కార్యక్రమం, కన్నీళ్లు పెట్టించే ఘటనలు
ఈ సందర్భంలో ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఇప్పటివరకూ బాబూ నాయనా రోడ్డుపైకి రాకండిరా అని చెప్పి చూశారు. చాలామంది వినకపోవడంతో వాళ్ల స్టైల్ మార్చారు. ‘కనిపిస్తే ఉతుకుడు’ అనే కొత్త కార్యక్రమానికి తెరతీశారు. ఎవడైనా ఇళ్లు విడిచి రోడ్డు మీదికి వస్తే పోలీసులు బ్యాటింగ్ ఆడేస్తున్నారు. ఎంత అత్యవసరం అయ్యి రోడ్డు మీదికి వచ్చినా ముందు కొట్టి ఆ తరువాత మాట్లాడుతున్నారు. కొట్టడం అంటే అలా ఇలా కాదు.. ఓరేంజ్లో ఉతికి ఆరేస్తున్నారు. ఆడ, మగ, తల్లి, పిల్ల అని తేడా లేకుండా విచక్షణారహితంగా ఉతికి ఆరేస్తున్నారు. ఎంత అత్యవరసం అనిపించినా అసలు ఎందుకు బయటకు వచ్చారో కూడా తెలుసుకోకుండా లాఠీలకు పనిచెప్తున్నారు. సరైన వైద్యం అందక.. బయటకు వెళ్లలేని పరిస్థితిలో ప్రాణాలు సైతం పోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అనంతరపురం జిల్లాలో దేవ అనే ఏడాది వయసున్న పసిబాలుడ్ని సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడంతో రక్తం కక్కుకుని చనిపోయిన ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది.
పోలీసుల ఉతుకుడు.. వైరల్ అవుతున్న వీడియోలు
ఈ ‘కనిపిస్తే ఉతుకుడు’ కార్యక్రమానికి సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంలో అటు పోలీసుల్ని కాని.. ఇటు జనాన్ని కాని తప్పుపట్టలేం. పోలీసులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. కొట్టకుండా బుజ్జీ నాయనా అంటే వర్మ చెప్పినట్టుగా ఎక్కి నెత్తిన కూర్చుంటారు. అయితే జనం కూడా మెడిసిన్, నిత్యవసరాల కోసం బయటకు వస్తుంటే పోలీసులు కరోనా కారణాన్ని చూపి దొంగల్ని బాదినట్టు బాదుతున్నారు. చిన్న పెద్ద ఆడ మగ బేధం లేకుండా లాఠీలు విరిగేలా జనాల్ని చావబాదుతున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన తమ కొడుకుని విచక్షణా రహితంగా పోలీసులు కొడుతున్న వీడియో వైరల్ అవుతున్న ఈ సందర్భంలో ఇలాంటి వీడియోలనే మరికొన్నింటిని షేర్ చేస్తూ.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు సినీనటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలత.
విచిత్రం ఏంటంటే.. నేను ఈ కామెంట్స్ చేయడం వల్ల జనం నాపై నీచమైన బండబూతులు తిడతారని నాకు తెలుసు.. రండి తిట్టడం అంటూ పిలుపునిచ్చి మరీ పోలీసుల్ని తిట్టడం మొదలు పెట్టింది మాధవీలత. తాజా పోస్ట్లో ఆమె పోలీసులు ప్రజల్ని వీర బాదుడు బాదుతున్న వీడియోలను పోస్ట్ చేసి.. ‘కమాన్.. మైడియర్ సోషల్ మీడియా హీరోస్.. నీఛమైన కామెంట్స్తో నన్ను ఎటాక్ చేయడానికి గెట్ రెడీ’ అంటూ మొదలు పెట్టింది. ‘కారణం తెలుసుకోవాలి.. అతిక్రమిస్తే కేసులు పెట్టమన్నారు.. ఇలా కొట్టమననేదు. బ్లడీ స్టుపిడ్ పోలీస్.. మీరు డ్యూటీ చేస్తున్నారు ఓకే. వాళ్లు కూడా మనుషులే.. మీరు మనుషుల్లా ప్రవర్తించండి. బయటకు వస్తున్న ప్రజలంతా తప్పు చేస్తున్నట్టు కాదు. కారణం లేకుండా బయటకు రారు.. ఒకవేళ వస్తే ఇలా దారుణంగా కొట్టే బదులు వారికి జరిమానా విధించండి. వాళ్లు చేసిన తప్పుకు జరినామా సరిపోతుంది. ఇలా సైకోల్లా ప్రవర్తించాల్సిన అవసరం లేదు’ అంటూ పోలీసులపై రెచ్చిపోయింది మాధవీలత.
అయితే మాధవీలత ముందుగా భావించినట్టే ఈ పోస్ట్పై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘నేను లేడీస్ని చాలా గౌరవిస్తారు.. మాటలు కూడా గౌరవంగానే ఉంటాయి. కాని నువ్వు పోలీస్లను బ్లడీ స్టుపిడ్ పోలీస్ అంటావా? కాస్త గౌరవంగా మాట్లాడు. పోలీస్లు పనిలేక ఇలా రోడ్లు మీదికి వచ్చి డ్యూటీ చేస్తున్నారా? వాళ్లకు ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్లకి కూడా కరోనా వచ్చే ప్రమాదం ఉంది. కాని ఫ్యామిలీస్ను వదిలేసి దేశం మొత్తం సెలవుల్లో ఉన్నా వాళ్లు మాత్రం పగలూ రాత్రి కాకుండా ఉద్యోగం చేస్తున్నారు. ప్రజల్ని రక్షిస్తున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకోసం పనిచేస్తున్నవాళ్లపై నోరు పారేసుకోకు’ అంటూ ఘాటుగా స్పందించాడు ఓ నెటిజన్.
ఒక్క 24 గంటలు డ్యూటీ చేయండి మాధవీలత గారూ.. ఇదే మాట అప్పుడు చెప్పండి
‘ఇలా ఫేస్ బుక్లో పోస్ట్ పెట్టడం కాదు.. పోలీసుల్లా నువ్ రోడ్డు మీదికి వచ్చి జనాన్ని నువ్ కంట్రోల్లో పెట్టు.. ఓ 24 గంటల పాటు డ్యూటీ చేయి. ఇదే మాట అప్పుడు చెప్పు. అప్పుడు తెలుస్తుంది నీకు నొప్పి. తన్నితేనే కాని కాని మనం జనం వినరు అని నీకే తెలుస్తుంది. దయచేసి బాధ్యతలేని పోస్ట్లు పెట్టి ప్రజల్ని రెచ్చగొట్టుద్దు. పోలీస్ వాళ్ల డ్యూటీ చేయనీయండి. అయినా మీరు పోస్ట్ చేసిన వీడియోలలో పోలీస్లు కొట్టడం వెనుక కారణం ఉంది. దుబాయ్ నుంచి వచ్చిన యువకుడు పోలీస్ల ముందు హీరోయిజం చూపించే ప్రయత్నం చేశాడు. కొట్టకుండా ఉంటే వినేటైప్ కాదని ఆ వీడియో చూస్తే అర్థమౌతుంది.. అతని ప్రవర్తన కూడా కరెక్ట్ కాదు.. ఇలాంటి కామెంట్స్ చేసే ముందు అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటో గమనించాలి. ఆవేశంలో నోటికొచ్చి మాట్లాడటం.. నవ్వులు పాలుకావడం కాదు’ అంటూ మరో నెటిజన్ చురకలు వేశాడు.
ఒంటిపై యూనిఫామ్.. చేతిలో లాఠీ ఉందని రెచ్చిపోతున్నారు..
అయితే మరికొంత మాధవీలత వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ.. నిజమే మేడమ్.. పోలీస్లు మరీ ఓవరాక్షన్ చేస్తున్నారు. అత్యావసరాలకోసం రోడ్డుపైకి వస్తున్నా కారణం తెలుసుకోకుండా కొట్టడం తప్పు. వాళ్లకు ఇచ్చిన పవర్స్ని మిస్ యూజ్ చేస్తున్నారు. ప్రజలకు చెప్పే విధానం ఇదికాదు. ఒంటి మీద యూనిఫామ్, చేతిలో లాఠీ ఉంది కదా అని ప్రతిఒక్కడు గబ్బర్ సింగ్లు అయిపోతున్నారు. వాళ్లకు లాఠీ రుచి చూపించాలి. జనం తిండిలేక ఇంట్లోనే చచ్చిపోమంటారా? వాళ్లు ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్లది. అత్యవసరం సమయాల్లో పోలీసులే ఆసుపత్రికి తరలించాలి. సాటి మనిషిగా ఆలోచించాలి అంటూ మరికొంత మంది నెటిజన్లు స్పందిస్తున్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.