యాప్నగరం

టాలీవుడ్‌లో పెరిగిపోయిన అనుపమ క్రేజ్.. రెమ్యూనరేషన్ పెంచేసిన బ్యూటీ

Anupama Parameswaran remuneration ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వరుసగా రెండు హిట్స్ పడటంతో ఈ భామ తన రెమ్యూనరేషన్‌ని డబుల్ చేసేసింది. ఐదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఏ సినిమాకి రానంత గుర్తింపు ఈ ఏడాది విడుదలైన కార్తీకేయ-2తో అనుపమ పరమేశ్వరన్‌కి వచ్చింది. అది కూడా పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్‌గా. దాంతో ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్‌లో ఒకరుగా అనుపమ పరమేశ్వరన్ నిలిచింది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 31 Dec 2022, 10:41 am

ప్రధానాంశాలు:

  • ఈ ఏడాది వరుసగా రెండు హిట్స్ అందుకున్న అనుపమ
  • ఒక్కసారి పెరిగిన ఈ అమ్మడి క్రేజ్
  • రెమ్యూనరేషన్‌ని డబుల్ చేసేసిన బ్యూటీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Anupama Parameswaran remuneration
అనుపమ పరమేశ్వరన్
టాలీవుడ్‌లో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ ఏడాది యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌తో కలిసి రెండు సినిమాల్లో అనుపమ నటించగా.. రెండూ హిట్‌గా నిలిచాయి. ఇందులో ‘కార్తికేయ-2’ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అయ్యి వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఆ తర్వాత వచ్చిన ‘18 పేజీస్’ మాత్రం ఆ రేంజ్‌లో హిట్ అవలేదు. కానీ అనుపమకి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనరేషన్‌ని డబుల్ చేసేసినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

సినిమా పోల్ 2022: మిమ్మల్ని మెప్పించిన నటి ఎవరు?.. క్లిక్ చేసి ఓటేయండి
వాస్తవానికి ఐదేళ్ల క్రితం వచ్చిన ‘శతమానం భవతి’ మూవీతో తెలుగులో అనుపమ పరమేశ్వరన్ పాపులర్ అయ్యింది. కానీ ఆ తర్వాత ఈ అమ్మడికి పెద్ద సినిమాల్లో అవకాశం రాలేదు. చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో ఒకానొక దశలో టాలీవుడ్‌ని వదిలేసి.. కోలీవుడ్‌కి ఈ భామ షిప్ట్ అయ్యింది. అక్కడ ధనుష్‌తో సినిమాలు చేసినా ఈ అమ్మడికి అవి కలిసిరాలేదు. దాంతో ఇక ఆమె కెరీర్ ముగిసిపోయిందనే ఊహాగానాలు అప్పట్లో వినిపించాయి.
2018లో వచ్చిన ‘తేజ్’, 2019లో వచ్చిన రాక్షసుడు సినిమాల్లో నటనకి అవకాశం ఉన్న పాత్రలే దక్కాయి. కానీ పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. ధనుష్‌ సరసన చేసిన ‘కోడి’ మూవీ హిట్ అయినా.. అందులో త్రిష ఉండటంతో అనుపమని సెకండ్ హీరోయిన్‌గానే ట్రీట్ చేశారు. ఓవరాల్‌గా ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఓ మోస్తరు రెమ్యూనరేషన్‌ని తీసుకుంటూ దొరికిన సినిమాల్ని చేసిన అనుపమ.. ఇప్పుడు క్రేజ్ పెరగడంతో తన రెమ్యూనరేషన్‌ని డబుల్ చేసేసిందట.

గత ఏడాది వరకూ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran remuneration) ఒక్కో సినిమాకి రూ.50-60 లక్షలు తీసుకునేదని.. ఇప్పుడు రూ.1.20 కోట్లని డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. మునుపటిలా అవకాశం దొరికిన సినిమాల్ని అనుపమ చేయడం లేదు. తనకి నచ్చి.. నటనకి స్కోప్ ఉండి.. పేరు వస్తుందని అనుకునే సినిమాలకి మాత్రమే సైన్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే స్వ్కేర్’ నుంచి కూడా ఈ భామ తప్పుకుంది. ఈ ఏడాది సూపర్ హిట్‌గా నిలిచిన డీజే మూవీకి ఇది సీక్వెల్. తొలుత ఈ మూవీ చేసేందుకు ఒప్పుకున్న అనుపమ ఆ తర్వాత సడన్‌గా తప్పుకుంది.

Read Latest Telugu Movies News , Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.