ఫేస్ మార్ఫింగ్ బ్యాక్డ్రాప్తో ఈరోజు ‘ముఖచిత్రం’ (Mukhachitram) అనే సినిమా థియేటర్లలోకి వచ్చింది. గంగాధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్, ప్రియ వడ్లమాని, అయేషా ఖాన్ (Ayesha Khan), వికాస్ వశిష్ట తదితరులు నటించారు. మూడేళ్ల క్రితం తెలంగాణలో జరిగిన ఓ క్రైమ్ స్టోరీని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారు. ఓ వివాహిత తన భర్తని చంపి.. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ప్రియుడ్ని ఆ స్థానంలోకి తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ చనిపోయిన వ్యక్తి తల్లి.. తన కొడుకు రూపంలో వచ్చిన వ్యక్తి ఆహారపు అలవాట్లని పరిశీలించి అతను తన కొడుకు కాదని తేల్చింది. ప్రవర్తనలో తేడాలు గమనించిన ఆ తల్లి తన కొడుకు నాన్వెజ్ తినడని తెలిసినా.. నాన్వెజ్ వండి ఆసుపత్రికి తీసుకెళ్లి పెట్టింది. దాంతో అతను లొట్టలేసుకుంటూ తిని అడ్డంగా దొరికిపోయాడు. అప్పట్లో ఈ కేసు తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఈ స్టోరీని సందీప్ రాజ్ ఆసక్తికర కథగా మార్చాడు. అతనే ‘ముఖచిత్రం’ మూవీకి స్క్రీన్ ప్లే కూడా అందించాడు.
‘ముఖచిత్రం’ సినిమా షూటింగ్ సమయంలో అయేషా ఖాన్కి తీవ్ర గాయాలైనట్లు దర్శకుడు గంగాధర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. సినిమాలో కారు యాక్సిడెంట్ సీన్ ఉంది. ఆ సీన్ని చిత్రీకరించే సమయంలో అయేషా అదుపు తప్పి పడిపోయిందట. దాంతో ఆమె వెన్ను భాగంలో తీవ్ర గాయమైనట్లు డైరెక్టర్ గుర్తు చేసుకున్నాడు. తొలుత గాయం తీవ్రత చూసి.. ఇక అయేషా నడవలేదేమో.. చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వస్తుందేమో అని తాము భయపడినట్లు గంగాధర్ చెప్పుకొచ్చాడు. కానీ.. రోజుల వ్యవధిలోనే ఆమె కోలుకుని మళ్లీ షూటింగ్కి హాజరైనట్లు వెల్లడించాడు. తెలుగులో అయేషా ఖాన్కి ఇదే ఫస్ట్ మూవీ.
ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ గెస్ట్ రోల్ పోషించాడు. వకీల్ సాబ్ తరహాలో కోర్టు వాదనలు ఉంటాయని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. అలానే మూవీలో ట్విస్ట్లు ప్రేక్షకుల్ని థ్రిల్ చేయబోతున్నట్లు కూడా డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో మాత్రం అభిమానులు పెదవి విరుస్తున్నారు. కథ కాస్త గజిబిజిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా నచ్చుతుందని చెప్తున్నారు. ఈరోజు దాదాపు 17 సినిమాలు రిలీజ్ అయ్యాయి.
Read Latest Telugu Movies News , Telugu News, Actress Photo Gallery
‘ముఖచిత్రం’ సినిమా షూటింగ్ సమయంలో అయేషా ఖాన్కి తీవ్ర గాయాలైనట్లు దర్శకుడు గంగాధర్ తాజాగా గుర్తు చేసుకున్నాడు. సినిమాలో కారు యాక్సిడెంట్ సీన్ ఉంది. ఆ సీన్ని చిత్రీకరించే సమయంలో అయేషా అదుపు తప్పి పడిపోయిందట. దాంతో ఆమె వెన్ను భాగంలో తీవ్ర గాయమైనట్లు డైరెక్టర్ గుర్తు చేసుకున్నాడు. తొలుత గాయం తీవ్రత చూసి.. ఇక అయేషా నడవలేదేమో.. చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వస్తుందేమో అని తాము భయపడినట్లు గంగాధర్ చెప్పుకొచ్చాడు. కానీ.. రోజుల వ్యవధిలోనే ఆమె కోలుకుని మళ్లీ షూటింగ్కి హాజరైనట్లు వెల్లడించాడు. తెలుగులో అయేషా ఖాన్కి ఇదే ఫస్ట్ మూవీ.
ఈ సినిమాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ గెస్ట్ రోల్ పోషించాడు. వకీల్ సాబ్ తరహాలో కోర్టు వాదనలు ఉంటాయని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. అలానే మూవీలో ట్విస్ట్లు ప్రేక్షకుల్ని థ్రిల్ చేయబోతున్నట్లు కూడా డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో మాత్రం అభిమానులు పెదవి విరుస్తున్నారు. కథ కాస్త గజిబిజిగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. కొత్తదనం కోరుకునే వారికి ఈ సినిమా నచ్చుతుందని చెప్తున్నారు. ఈరోజు దాదాపు 17 సినిమాలు రిలీజ్ అయ్యాయి.
Read Latest Telugu Movies News , Telugu News, Actress Photo Gallery