యాప్నగరం

చార్మి షాకింగ్ నిర్ణయం.. సోషల్‌మీడియా నుంచి బ్రేక్.. కారణం అదేనా..?

ఒకప్పటి అందాల నటి చార్మి గత కొంతకాలంగా నటనకు స్వస్తి చెప్పి.. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి ఆమె నిర్మాణ రంగంలోకి దిగింది. అయితే తాజాగా చార్మి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్‌మీడియా నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నట్లు చార్మి ప్రకటించింది.

Samayam Telugu 22 Apr 2021, 3:57 pm
రెండో దశలో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉంది. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన పలువురు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా.. తమ అభిమానులకు సూచిస్తున్నారు. అవసరం ఉంటేనే బయటకు రావాలని లేని పక్షంలో ఇంటి వద్దే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్లు చెబుతున్నారు. ఎవరికి తోచిన స్టైల్‌లో వాళ్లు తమ అభిమానులకు సూచనలు చేస్తున్నారు. అయితే ఒకప్పటి అందాల నటి, ప్రస్తుత నిర్మాత చార్మి ఈ పరిస్థితుల్లో కీలక నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu చార్మి కౌౌర్
Charmee Kaur


హీరోయిన్‌గా తన అందాలతో ఆకట్టుకున్న చార్మి.. సరైన హిట్లు లేక కొంతకాలం క్రితం నటనకి గుడ్‌బై చెప్పింది. అప్పటి నుంచి పూరి జగన్నాధ్‌తో కలిసి ఆమె నిర్మాణ రంగంలో అడుగు పెట్టింది. అయితే చార్మి సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలకు సంబంధించిన అంశాలే కాక.. సామాజిక అంశాలపై కూడా ఆమె తరచూ స్పందిస్తుంటుంది. అలాంటి చార్మి సోషల్‌మీడియా నుంచి ఉన్నపళంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఎక్కడ చూసిన కరోనా వ్యాప్తికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. రోజుకి ఎంతమంది కరోనా బారిన పడుతున్నారు.. ఎంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు అనే వార్తలే తారసపడుతున్నాయి. అయితే ఈ వార్తలు అన్నీ.. చార్మిని చాలా ఇబ్బంది పెడుతున్నాయట. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను చూసి తట్టుకొనే శక్తి తనకు లేదని చెప్పిన చార్మి.. కొద్ది రోజుల వరకూ సోషల్‌మీడియా నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అందకూ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది.
View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur)

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాకి చార్మి నిర్మాతగా వ్యవహరిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.