యాప్నగరం

బిగ్‌బాస్‌లో దీక్ష రగడ: ధనరాజ్ బయటకలవాలని ఫోర్స్ చేశాడట!

ధన్‌రాజ్, హీరోయిన్ దీక్షా పంత్‌ల వివాదం ఏంటి? బిగ్‌బాస్ హౌస్‌లో ఏం జరిగింది? ప్రేక్షకులకు చూపించని విషయాలు హౌస్‌లో ఏమి జరిగాయి?

TNN 20 Sep 2017, 8:33 pm
బిగ్‌బాస్ రియాలిటీ షో అంటేనే అదో బ్రాండ్ ఈ షోలో క్లిక్ అయితే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి సెలబ్రిటీలు పోటీ పడతారు. సుమారు 18 భాషల్లో టెలికాస్ట్ అవుతున్న బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. దీంతో తెలుగులో ఎన్టీఆర్‌ని హోస్ట్‌గా పెట్టి ‘బిగ్ బాస్ రియాలిటీ షో’ జూలై 16న బుల్లితెరపై ప్రారంభించారు. ఇప్పటికి ఈ షో 66 ఎపిసోడ్‌లను కంప్లీట్ చేసి ఫైనల్‌కి మరో ఐదు ఎపిసోడ్‌ల దూరంలో ఉంది.
Samayam Telugu actress deeksha panth sensational comments on dhan raj
బిగ్‌బాస్‌లో దీక్ష రగడ: ధనరాజ్ బయటకలవాలని ఫోర్స్ చేశాడట!


ఇదిలాఉంటే ఈషోలో కన్టెస్టెంట్స్‌గా మొదట 14 మందిని ఎంపిక చేశారు. మరో ఇద్దరు నవదీప్, దీక్షలను వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ షో ఫైనల్ దశకు వచ్చేసరికి మొత్తం 16 మంది కన్టెస్టెంట్స్‌కి ఐదుగురు మాత్రమే మిగిలారు. అయితే గత ఆదివారం జరిగిన చివరి ఎలిమేషన్స్‌లో హౌస్ నుండి బయటకు వచ్చేసిన దీక్షా పంత్ బిగ్ బాస్ షోపైన, హౌస్‌లో ఉన్న కన్టెస్టెంట్స్‌పైన సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచింది.

బిగ్ బాస్ ఇంట్లో ఉన్నన్ని రోజులు చాలా బాగుందని.. మళ్లీ కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లుగా ఉందన్న ఆమె ఇప్పుడిప్పుడే తాను ఆ మూడ్ నుంచి బయటకు వస్తున్నానన్నారు. షో నుంచి ఎలిమినేట్ అయినందుకు ఎలాంటి ఫీలింగ్ లేదన్న ఆమె.. బిగ్ బాస్ షోలో తనకు తెలిసిన వారి కంటే తెలియని వారే ఎక్కువమంది ఉన్నారన్నారు. తనను విమర్శించటం కొంచెం బాధగా అనిపించిందంటూ తన తోటి కన్టెస్టెంట్ ధనరాజ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

కమెడియన్ ధనరాజ్ బిగ్ బాస్ హౌస్‌లో తన గురించి ఏవేవో ఊహించి మిగిలిన కన్టెస్టెంట్స్‌కి చెప్పాడని అయితే అసలు కారణం వేరే ఉందన్నారు. ఆయనతో కలిసి గతంలో నేను ఓ సినిమాలో నటించానని ఆ సమయంలో అతడు తనతో హద్దు మీరు ప్రవర్తించడంతో పాటు మనం భయట కలుద్దాం అంటూ పదే పదే నన్ను ఫోర్స్ చేసేవాడని, అతని బిహేవ్ నచ్చక దూరం పెట్టానంది. దీంతో బిగ్‌బాస్ హౌస్‌లో కూడా అతనితో సన్నిహితంగా ఉండలేకపోయానన్నది.

ఈ కారణంతోటే నేను హౌస్‌లోకి వెళ్లిన మొదటి రోజు నుంచి ధన్‌రాజ్ నాకు వ్యతిరేకంగానే ఉన్నారు. బయట ఎవరు ఎలాంటి వారో తెలియకపోవచ్చు.. కానీ హౌస్‌లో కెమెరాలు ఉంటాయి. ప్రతిది రికార్డు అవుతుంది. నేను సినిమా వరకే ఆయనతో మంచిగా ఉన్నా బయట ఎప్పుడూ కలవలేదు. అదే కారణంతోటే అతడు తనపై కక్షపూరితంగా వ్యవహరించాడంటూ ఆరోపణలు గుప్పించింది.

మరోవైపు బిగ్ బాస్ షో ప్రసారంపై అభ్యంతరం వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. తాను చేసిన మంచిపనుల్ని చూపించలేదని కేవలం తాను తినేది మాత్రమే చూపించారన్నారు. చాలాచోట్ల తన ఫెర్పామ్మెన్స్ ను తప్పుగా చూపించారన్న ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లో తాను రాత్రి పూట పనిచేసేదానినని అది ఒక్కసారి కూడా చూపించకుండా నేను ఎప్పుడైతే తింటూ ఉన్నానో అది మాత్రమే టెలికాస్ట్ చేశారన్నది.

ఏదైనా డిస్కర్షన్ జరిగితేనే టీవీలో చేపిస్తారన్న విషయం తనకు బయటకు వచ్చిన తర్వాతే తెలిసిందన్నారు. ఇక మిగిలిన కన్టెస్టెంట్స్‌లో నవదీప్ చాలా కన్నింగ్ అని, అర్చనకు కావాలనే ప్రతిసారి తానేం మాట్లాడినా గొడవ పెట్టుకునేదని.. తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్నారు. హరిప్రియ మొదట్లో బాగానే ఉన్నా తర్వాత తను మారిందంటూ ఆరోపణలు గుప్పించింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్‌నుండి బయటకు వచ్చిన కన్టెస్టెంట్స్ అందరూ షోకి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఇస్తుంటే వీరందరికీ భిన్నంగా దీక్షా పంత్ బిగ్‌బాస్‌ షో పైన, కన్టెస్టెంట్స్ పైన సంచలన ఆరోపణలు చేసి హాట్ టాపిక్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.