యాప్నగరం

కవిత.. భారతీయ జనతా పార్టీలోకి..!

తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ తో ఆమె సమావేశం అయ్యారు.

TNN 26 Oct 2017, 12:31 pm
తెలుగుదేశం పార్టీలో పరిణామాలు తనను అసహనానికి గురి చేశాయని, ఆ పార్టీలో తనకు ఏ మాత్రం ప్రాధాన్యత దక్కడం లేదని ఇటీవల వ్యాఖ్యానించిన నటీమణి కవిత.. ఇప్పుడు పార్టీ మారుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సీనియర్ నటీమణి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ తో ఆమె సమావేశం అయ్యారు. భారతీయ జనతా పార్టీలో చేరే ఆకాంక్షను వ్యక్తం చేశారట ఆమె.
Samayam Telugu actress kavitha likely to join bjp
కవిత.. భారతీయ జనతా పార్టీలోకి..!


‘కవిత నాతో సమావేశం అయిన మాట వాస్తవమే. భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆమె అనుకుంటున్నారు. దేశాన్ని అన్ని విధాలుగానూ ముందుకు తీసుకెళ్లగల పార్టీ బీజేపీ మాత్రమే అని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే మా పార్టీలో చేరాలని అనుకుంటున్నారు..’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.

కొన్నేళ్ల కిందట కవిత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున కొంత కాలం యాక్టివ్ గా కనిపించారు. అయితే రోశయ్య ఏపీకి ముఖ్యమంత్రి అయిన దశలో ఆమె కాంగ్రెస్ వైపు వెళ్లేట్టుగా అగుపించారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధిష్టానం అసహనం వ్యక్తం చేస్తూ వార్తల్లోకి వచ్చారు. తను తెలుగుదేశం వీడతాను అని ప్రకటించారు. ఇప్పుడు కమలం పార్టీ బాట పడుతున్నట్టున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.