అయోధ్య రామమందిర నిర్మాణ భూమిపూజతో కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. బుధవారం నాడు ప్రధాని మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణానికి పునాది రాయి పడటంతో పండుగ వాతావరణాన్ని తలిపించింది. మోదీపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ఆయన్ని ఆకాశానికెత్తేస్తున్నారు అభిమానులు. అయితే కొంతమంది అత్యుత్సాహం చూపిస్తూ.. మోదీ భుజంపై శ్రీరాముడు తల పెట్టుకుని సేదతీరుతున్నట్టుగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం అనేక విమర్శలకు తావిస్తోంది.
ఇక దీంతో పాటు అయోధ్య మందిరం వైపు మోదీ నడుస్తుండగా.. ఆయన చేయిపట్టుకుని వెనకనే రాముడు నడుస్తున్నగా ఉన్న ఫొటోని కూడా మోడీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. చాలా మంది ఈ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా వాట్సాప్ డీపీలు, ఫేస్ బుక్ కవర్ పేజీలుగా కూడా పెట్టుకుని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అయితే దీనిపై చాలా మంది రామభక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోడీని దేవుడికంటే గొప్పగా చూపించడం.. మోడీ వెనుక రాముడు నడిచి వెళ్లడం.. మోడీని దేవుడిగా పెద్దగా చూపించి.. రాముడి ఫొటోలను చిన్నగా చూపించడంపై మండిపడుతున్నారు.
ఇక మోదీపై ప్రశంసలు వెల్లువెత్తుతూ కర్ణాటక బీజేపీ ఎంపీ శోభ.. మోడీ చేయిపట్టుకుని చేయిపట్టుకుని వెనుకే నడుస్తున్న రాముడి ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రముఖ నటి, కాంగ్రెస్ లీడర్ కుష్బూ. ‘వావ్! ఇప్పుడు లార్డ్ రాముడి కంటే మోదీ పెద్దవాడయ్యారు. కలియుగం మరి'’ అంటూ సెటైర్లు వేసింది. అయితే కొంతమంది కుష్భూకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతుంటే.. కరెక్ట్గా చెప్పారు మేడమ్.. ఆ మందిరం లోపల రాముడు పక్కన మోడీ విగ్రహం పెట్టుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు’ అంటూ వెటకారంగా స్పందిస్తున్నారు.
ఇక దీంతో పాటు అయోధ్య మందిరం వైపు మోదీ నడుస్తుండగా.. ఆయన చేయిపట్టుకుని వెనకనే రాముడు నడుస్తున్నగా ఉన్న ఫొటోని కూడా మోడీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. చాలా మంది ఈ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా వాట్సాప్ డీపీలు, ఫేస్ బుక్ కవర్ పేజీలుగా కూడా పెట్టుకుని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అయితే దీనిపై చాలా మంది రామభక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మోడీని దేవుడికంటే గొప్పగా చూపించడం.. మోడీ వెనుక రాముడు నడిచి వెళ్లడం.. మోడీని దేవుడిగా పెద్దగా చూపించి.. రాముడి ఫొటోలను చిన్నగా చూపించడంపై మండిపడుతున్నారు.
ఇక మోదీపై ప్రశంసలు వెల్లువెత్తుతూ కర్ణాటక బీజేపీ ఎంపీ శోభ.. మోడీ చేయిపట్టుకుని చేయిపట్టుకుని వెనుకే నడుస్తున్న రాముడి ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రముఖ నటి, కాంగ్రెస్ లీడర్ కుష్బూ. ‘వావ్! ఇప్పుడు లార్డ్ రాముడి కంటే మోదీ పెద్దవాడయ్యారు. కలియుగం మరి'’ అంటూ సెటైర్లు వేసింది. అయితే కొంతమంది కుష్భూకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతుంటే.. కరెక్ట్గా చెప్పారు మేడమ్.. ఆ మందిరం లోపల రాముడు పక్కన మోడీ విగ్రహం పెట్టుకున్నా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు’ అంటూ వెటకారంగా స్పందిస్తున్నారు.