‘నాకు నా డైలాగ్లే గుర్తు ఉండవు.. మా నాన్నగారి డైలాగ్లా.. కెవ్వూ’ అనే కేకతో మొదలైన మంచులక్ష్మి స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత లీడ్లో నటించిన ‘ఓ బేబీ’ మూవీ జూలై 5న విడుదలకు రెడీ కావడంతో ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా.. గత శనివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరైన మంచులక్ష్మి స్పీచ్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇంతకీ మంచు లక్ష్మి ఏమన్నారు? ఎందుకు ట్రోల్ చేస్తున్నారనే విషయానికి వస్తే.. ముందు అక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఓ బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీనియర్ యాంకర్ ఝాన్సీ ‘ఓ బేబీ’ మూవీ థీమ్కి తగ్గట్టుగా బామ్మ అవతారంలో డిఫరెంట్ గెటప్లో దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మిని స్టేజ్పైకి పిలుస్తూ.. తన దైన శైలిలో మంచులక్ష్మి గాల్లో విహరించేటంత లెవల్లో ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘సూత్తున్నానమ్మా నిన్నూ.. ఎంత అందంగా ఉంటుందో ఈ అమ్మాయి అని.. పైగా ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో... నోరు విప్పిందంటే పులేగా ఆడ పులి. ఇక్కడ పులి అయితే అక్కడ సింహం అని రానాని ఉద్దేశించి అన్నారు ఝాన్సీ. దీనికి కౌంటర్గా అంతేనా.. సింహాలు, పులులే ఇండస్ట్రీని లీడ్ చేసేది అంటూ పంచ్ పేల్చింది.
అనంతరం ‘ఓ బేబీ’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రారంభం కాకముందే కథ మొత్తం నాకు తెలుసు. ఈ పాత్ర సమంత కాకుండా ఎవరూ చేయలేరు. డైరెక్టర్ నందిని చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. ఈ సినిమా డబ్బింగ్ ఎలా జరగబోతుందా? సమంత కామెడీ టైమింగ్ పట్టగలరా అని చాలా టెన్షన్ పడ్డారు. సమంత పాత్రలో ఎంత లీనమై చేస్తారో.. ‘ఓ బేబీ’ సినిమా చూస్తే అర్ధం అయిపోతుంది.
నా తరువాత మాట్లాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందువల్ల ఇంగ్లీష్లో మాట్లాడితేనే తొందరగా మాట్లాడగలను. తెలుగు అంటే రోజంతా పడుతుంది. (ఈలోపు ఆడియన్స్ తెలుగులోనే మాట్లాడని కేకలు వేయగా). ఏంటీ.. తెలుగులోనే మాట్లాడాలా? చచ్చారు పోండి.. అయితే తెలుగులోనే మాట్లాడతాను. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ బెస్ట్ విషెష్.
ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ అంకుల్.. (తలవంచి నమస్కారం పెడుతూ..) ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మనోజ్ ఉండి ఉంటే.. కేవలం ఆయన గురించే మాట్లాడేవాడు. ఎందుకంటే ‘జంబలకిడిపంబ’ సినిమా వందసార్లు కాదు కదా.. 150, 1000 సార్లుకు పైగా ఆ క్యాసెట్ అరిగేదాకా స్కూల్ కాగానే ఆ సినిమానే చూసేవాళ్లం. దీంతో పాటు ‘ఏప్రిల్ 1 విడుదల’ ఇలా ఎన్నో మంచి సినిమాలతో అలరించారని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ‘ఓ బేబీ’ చిత్రంలో సమంత చెప్పిన డైలాగ్ను స్టేజ్పై ఇరగదీసింది మంచులక్ష్మి. నీకు కాబోయే మొగుడు ఎలా ఉండాలి? అని ఝాన్సీ అడగడంతో.. ‘నా మొగుడు ఎలా ఉండాలంటే.. చూడ్డానికి అందంగా ఉండాలి. అడిగిందల్లా కొని ఇవ్వాలి. మంచం ఎక్కితే ఊ.. ఊ.. మగాడిలా కాపురం చేయాలి అని ఓ రేంజ్లో డైలాగ్ చెప్పారు మంచు లక్ష్మి.
ఇక మంచులక్ష్మి స్పీచ్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఏంటమ్మా.. ‘జంబలకిడిపంబ’ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్నా? మరి నరేష్ ఎవరు? మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయకు మంచుఅక్కా అంటూ పంచ్లు పేలుస్తున్నారు. ఇక యాంకర్ ఝాన్సీ యాంకరింగ్ కూడా బాగా ఓవర్గా ఉందంటూ దయచేసి మీరు యాంకరింగ్ చేస్తే బాగుంటుంది.. ఓవరాక్షన్ వద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఓ బేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీనియర్ యాంకర్ ఝాన్సీ ‘ఓ బేబీ’ మూవీ థీమ్కి తగ్గట్టుగా బామ్మ అవతారంలో డిఫరెంట్ గెటప్లో దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మిని స్టేజ్పైకి పిలుస్తూ.. తన దైన శైలిలో మంచులక్ష్మి గాల్లో విహరించేటంత లెవల్లో ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘సూత్తున్నానమ్మా నిన్నూ.. ఎంత అందంగా ఉంటుందో ఈ అమ్మాయి అని.. పైగా ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో... నోరు విప్పిందంటే పులేగా ఆడ పులి. ఇక్కడ పులి అయితే అక్కడ సింహం అని రానాని ఉద్దేశించి అన్నారు ఝాన్సీ. దీనికి కౌంటర్గా అంతేనా.. సింహాలు, పులులే ఇండస్ట్రీని లీడ్ చేసేది అంటూ పంచ్ పేల్చింది.
అనంతరం ‘ఓ బేబీ’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రారంభం కాకముందే కథ మొత్తం నాకు తెలుసు. ఈ పాత్ర సమంత కాకుండా ఎవరూ చేయలేరు. డైరెక్టర్ నందిని చాలా విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. ఈ సినిమా డబ్బింగ్ ఎలా జరగబోతుందా? సమంత కామెడీ టైమింగ్ పట్టగలరా అని చాలా టెన్షన్ పడ్డారు. సమంత పాత్రలో ఎంత లీనమై చేస్తారో.. ‘ఓ బేబీ’ సినిమా చూస్తే అర్ధం అయిపోతుంది.
నా తరువాత మాట్లాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందువల్ల ఇంగ్లీష్లో మాట్లాడితేనే తొందరగా మాట్లాడగలను. తెలుగు అంటే రోజంతా పడుతుంది. (ఈలోపు ఆడియన్స్ తెలుగులోనే మాట్లాడని కేకలు వేయగా). ఏంటీ.. తెలుగులోనే మాట్లాడాలా? చచ్చారు పోండి.. అయితే తెలుగులోనే మాట్లాడతాను. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ బెస్ట్ విషెష్.
ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ అంకుల్.. (తలవంచి నమస్కారం పెడుతూ..) ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మనోజ్ ఉండి ఉంటే.. కేవలం ఆయన గురించే మాట్లాడేవాడు. ఎందుకంటే ‘జంబలకిడిపంబ’ సినిమా వందసార్లు కాదు కదా.. 150, 1000 సార్లుకు పైగా ఆ క్యాసెట్ అరిగేదాకా స్కూల్ కాగానే ఆ సినిమానే చూసేవాళ్లం. దీంతో పాటు ‘ఏప్రిల్ 1 విడుదల’ ఇలా ఎన్నో మంచి సినిమాలతో అలరించారని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ‘ఓ బేబీ’ చిత్రంలో సమంత చెప్పిన డైలాగ్ను స్టేజ్పై ఇరగదీసింది మంచులక్ష్మి. నీకు కాబోయే మొగుడు ఎలా ఉండాలి? అని ఝాన్సీ అడగడంతో.. ‘నా మొగుడు ఎలా ఉండాలంటే.. చూడ్డానికి అందంగా ఉండాలి. అడిగిందల్లా కొని ఇవ్వాలి. మంచం ఎక్కితే ఊ.. ఊ.. మగాడిలా కాపురం చేయాలి అని ఓ రేంజ్లో డైలాగ్ చెప్పారు మంచు లక్ష్మి.
ఇక మంచులక్ష్మి స్పీచ్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఏంటమ్మా.. ‘జంబలకిడిపంబ’ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్నా? మరి నరేష్ ఎవరు? మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయకు మంచుఅక్కా అంటూ పంచ్లు పేలుస్తున్నారు. ఇక యాంకర్ ఝాన్సీ యాంకరింగ్ కూడా బాగా ఓవర్గా ఉందంటూ దయచేసి మీరు యాంకరింగ్ చేస్తే బాగుంటుంది.. ఓవరాక్షన్ వద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు.