యాప్నగరం

బీజేపీలో చేరనున్న పూజాగాంధీ...?

దండుపాళ్యం ఫేమ్, ప్రముఖనటి పూజాగాంధీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే బీజేపీ నేత యడ్యూరప్పను కలుసుకున్న ఆమె పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలిసింది.

Samayam Telugu 25 Mar 2018, 4:32 pm
దండుపాళ్యం ఫేమ్, ప్రముఖనటి పూజాగాంధీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే బీజేపీ నేత యడ్యూరప్పను కలుసుకున్న ఆమె పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలిసింది. అయితే... పూజా గాంధీ ఇప్పటికే పలు పార్టీలు మారిందని... ఆమెను నమ్మొదని.. కొందరు నాయకులు ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో... వారిని సమాధానపరిచే బాధ్యతను పార్టీ సీనియర్ నేత మురళీధరరావుకు అప్పగించారు.
Samayam Telugu Pooja-Gandhi


గతంలో దేవెగౌడ ఆధ్వర్యంలోని జనతాదళ్ పార్టీలో చేరిన ఆమె... తర్వాత... యడ్యూరప్ప స్థాపించిన కర్ణాటక జనతా పక్షలో చేరారు... అక్కడ కూడా ఆమె ఎక్కువ కాలం కొనసాగలేదు. బి. శ్రీరాములు నెలకొల్పిన.. బడవర శ్రామికర రైతర కాంగ్రెస్ (బీఎస్సార్ కాంగ్రెస్) పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో పోటీచేసి ఘోరపరాభవాన్ని చవిచూసింది. ఆ సమయంలో ఎన్నికల ఉల్లంఘన కేసుులు కూడా ఆమెపై నమోదయ్యాయి. రాజకీయాల్లోకి వచ్చి తప్పుచేశానని... కొద్దిరోజులు క్రితం ప్రకటించిన ఆమె... మనసు మార్చుకొని భారతీయ జనతాపార్టీలో చేరేందుకు సిద్ధమైపోయింది. బీజేపీ నుంచి తనకు తీపి కబురు వస్తుందన్న ఆశతో ... ఎదురుచూస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.