యాప్నగరం

ఎన్ని చట్టాలొచ్చినా ఈ రాక్షసులు మారడం లేదు: రేణూ దేశాయ్

ఆడవాళ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలపై దేశం మొత్తం రగులుతోంది. వరుస ఘటనలపై సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమమే నడుస్తోంది. ఆడపిల్లలపై దారుణాలకు ఒడిగట్టే వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నినాదానికి నేను సైతం అంటూ మద్దతు పలికారు సినీ నటి రేణూ దేశాయ్.

Samayam Telugu 16 Apr 2018, 8:50 pm
ఆడవాళ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలపై దేశం మొత్తం రగులుతోంది. వరుస ఘటనలపై సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమమే నడుస్తోంది. ఆడపిల్లలపై దారుణాలకు ఒడిగట్టే వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నినాదానికి నేను సైతం అంటూ మద్దతు పలికారు సినీ నటి రేణూ దేశాయ్. సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన ఆవేదనను తెలియజెప్పే ప్రయత్నం చేశారు. మొన్న నిర్భయ, నిన్న ఉన్నావ్, నేడు కథువా ఇలా ఘటన ఏదైనా... ప్రాంతం, కులం ఏదైనా వారికి సంబంధం లేదు... మనం గమనించాల్సింది ఆడపిల్లలన్నారు రేణూ. ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఆడపిల్లలుగా పుట్టడమే పాపమా అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu Renu


ఈ వరుస ఘటనలపై తన ఆవేదనను ఓ లాయర్, సామాజిక కార్యకర్త, పోలీసు అధికారితో పంచుకొన్నానని... ఇలాంటి ఘటన జరగకుండా ప్రజల్లో చైతన్యం తేవాలని కోరానన్నారు. కాని వారు మాత్రం... ఇలాంటి ఘోరాలకు పాల్పడాలంటే వారికి వెన్నులో వణుకు పుట్టేలా ప్రభుత్వం చట్టాలను చేస్తే తప్ప... ఎన్ని కార్యక్రమాలు చేసినా ఉపయోగం ఉండదని వారు తనతో చెప్పారన్నారు. ఆడపిల్లలపైన జరుగుతున్నఆకృత్యాలపై... సోషల్ మీడియాలో, రోడ్లపై ర్యాలీల రూపంలో మనం నిరసనలు తెలుపుతూనే ఉన్నాం. అయినా ఈ ఘటనలు ఆగట్లేదు... ఈ చర్యలకు పాల్పడే రాక్షసుల్లో ఎటువంటి మార్పు రావట్లేదన్నారు. ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకొచ్చినప్పుడే ఇలాంటి ఘటనలు ఆగుతాయన్నారు. అప్పటి వరకు మన ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత... తల్లిదండ్రులపై ఉందన్నారు రేణూ దేశాయ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.