యాప్నగరం

Janasena Trolls: ఎవరికి ఓటేయాలో నాకు తెల్సు.. మీ లెక్చర్లు ఆపండి: రేణు దేశాయ్ ఫైర్

ఓటు హక్కు గురించి తన వాల్‌పై చాలా మంది లెక్చర్లు ఇస్తూ తన వాల్‌పై వేలికి ఇంక్ ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారని వాటిని మళ్లీ చూపించొద్దని కోరారు. జనహితం కోసమే ఈ పోస్ట్ పెడున్నా అంటూ ఘాటుగా స్పందించారు రేణు దేశాయ్.

Samayam Telugu 12 Apr 2019, 7:33 pm
స్వయానా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారించినా.. జనసైనికులు మాత్రం సోషల్ మీడియా గిచ్చుడు మానడం లేదు. వీరి అత్యుత్సాహం పవన్‌కి పలుసార్లు తలనొప్పి తెచ్చిపెడుతున్నా.. వెనక్కి మాత్రం తగ్గడం లేదు. లేనిపోని విమర్శలు.. అక్కర్లేని ట్రోలింగ్స్‌తో.. పనికిరాని కామెంట్స్‌తో ఏదో రకంగా పవన్ ఇమేజ్‌కు డ్యామేజ్ చేసే కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. అయితే ఎవరో బయట వ్యక్తుల్ని విసిగిస్తే.. ఓ అర్ధం ఉంటుంది. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌ని మరోసారి టార్గెట్ చేసి.. ఆమె ఆగ్రహాన్ని చవిచూశారు జనసైనికులు.
Samayam Telugu Renu Desai


అసలు విషయానికి వస్తే.. ఏపీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీకి ఓటు వేయాల్సిందిగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వాల్‌పై జనసైనికులు కొన్ని పోస్ట్‌లు పెట్టారు. అదే పనిగా ఈ అన్నకు ఓటేయమని మాజీ వదినను ఇబ్బంది పెడుతూ వరుస మెసేజ్‌ పెట్టడంతో ఫైర్ అయ్యింది రేణు దేశాయ్.

తనకు ఓటు ఎవరికి వేయాలో ఎప్పుడు వేయాలో తెలుసని.. వీటిపై లెక్చర్లు ఇవ్వడం ఆపండి అంటూ చురకలు అంటించింది. తనకు నచ్చిన వ్యక్తికి, నచ్చిన పార్టీకి ఈనెల 23న ఓటు వేస్తున్నా అని.. తన ఓటు హక్కు పూణెలో ఉందని వివరించింది రేణు. దయచేసి ఇప్పటికైనా మెసేజ్‌లు ఆపమని కోరిందామె.

ఓటు హక్కు గురించి తన వాల్‌పై చాలా మంది లెక్చర్లు ఇస్తూ తన వాల్‌పై వేలికి ఇంక్ ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారని వాటిని మళ్లీ చూపించొద్దని కోరారు. జనహితం కోసమే ఈ పోస్ట్ పెడున్నా అంటూ ఘాటుగా స్పందించారు రేణు దేశాయ్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.