యాప్నగరం

Samantha: ఇన్‌స్టాలో సమంత మరో ఎమోషనల్ పోస్ట్.. బాధపడకు అమ్మా!

Samantha Ruth Prabhu మయోసైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతోంది. కండరాలకి సంబంధించిన ఈ వ్యాధి కారణంగా ఆమె మునుపటిలా ఉత్సాహంగా ఉండలేకపోతోంది. దాంతో మీడియాకి గత కొన్ని నెలలుగా దూరంగా ఉండిపోయిన ఈ హీరోయిన్.. ఇటీవల శాకుంతలం ప్రెస్‌మీట్‌కి హాజరైంది. కానీ.. అక్కడ ఆమె ఎమోషనల్ అయిపోగా.. నెటిజన్లు నెగటివ్‌గా కామెంట్స్ చేశారు. సింపథీ కోసం ప్రయత్నిస్తోందని కొందరు కామెంట్ చేయగా.. గ్లో తగ్గిపోయిందంటూ మరికొందరు...

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 14 Jan 2023, 7:12 pm

ప్రధానాంశాలు:

  • గత ఏడాది చివర్లో మీడియాకి దూరంగా ఉండిపోయిన సమంత
  • ఇటీవల శాకుంతలం ప్రెస్‌మీట్‌కి హాజరైన హీరోయిన్
  • వేదికపైనే ఎమోషనల్ అయిపోయిన సమంత
  • నెటిజన్ల నుంచి నెగటివ్ కామెంట్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Samantha Ruth Prabhu
సీనియర్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్‌స్టాలో మరో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గత ఏడాది తాను మయోసైటిస్ బారినపడినట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన సమంత.. ఆ తర్వాత మీడియా, పబ్లిక్, సోషల్ మీడియాకి కూడా చాలా రోజులు దూరంగా ఉండిపోయింది. యశోద మూవీ ప్రీరిలీజ్, ప్రమోషన్స్, సక్సెస్ మీట్‌లో కూడా సమంత కనిపించలేదు. ఇంటి దగ్గరే ఉండి మయోసైటిస్‌కి చికిత్స తీసుకుంటూ వచ్చింది. అయితే.. వారం క్రితం ‘శాకుంతలం’ (Shaakuntalam) మూవీ ప్రమోషన్స్ కోసం సమంత మళ్లీ మీడియా ముందుకు వచ్చింది.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా కోసం ఇటీవల మళ్లీ పబ్లిక్‌లోకి వచ్చిన సమంత.. విమానాశ్రయంలో అభిమానులతో కలిసి ఫొటోలు దిగింది. అలానే శాకుంతలం మూవీ ప్రెస్‌మీట్‌లోనూ మాట్లాడింది. కానీ ఆ సమయంలో సమంత ఎమోషనల్ అవడం, కాస్త అసౌకర్యంగా కూర్చుని కనిపించడంతో కొంత మంది నెటిజన్లు నెగటివ్‌గా కామెంట్స్ చేశారు.

సమంతలో మునుపటి గ్లో తగ్గిపోయిందని.. విడాకుల తర్వాత కూడా హుషారుగా కనిపించిన సమంత ఇప్పుడు వీక్ అయిపోయిందంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. దాంతో సమంత గట్టిగానే వారికి కౌంటర్ ఇచ్చింది. మీరు నాలాగా దీర్ఘకాలిక వ్యాధి నుంచి కోలుకునేందుకు కొన్ని నెలల పాటు మెడిసన్ తీసుకోకూడదని ప్రార్థిస్తున్నాను అని చెప్తూనే.. మీ గ్లో కూడా పెరగాలని కోరుకుంటున్నా అని కౌంటర్ ఇచ్చింది.

శాకుంతలం డైరెక్టర్ గుణ శేఖర్ మాట్లాడుతున్న సమయంతో సమంత స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకోవడంపై కూడా నెటిజన్లు నెగటివ్‌గా కామెంట్స్ చేశారు. ఆమె సింపథీ కోసం ప్రయత్నిస్తోందనే విమర్శలు కూడా వచ్చాయి. దాంతో సమంత మరో పోస్ట్‌తో వారికి కౌంటర్ ఇచ్చింది. సోఫాపై బోర్లా పడుకుని సమంత ఎమోషనల్ అవుతుండగా.. ఆమె పెంపుడు శునకం ఒకటి ఓదారుస్తున్నట్లు కనిపించింది. ఈ ఫొటోని షేర్ చేసిన సమంత ‘బాధపడకు అమ్మా.. నీ వెనుక నేనున్నా’ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Read Latest Telugu Movies News , Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.