యాప్నగరం

తొలిప్రేమ హీరోయిన్‌కి ఎన్సీబీ నోటీసులు.. డ్రగ్స్ ఉచ్చులో పడి జంప్!! ఇదే అసలు ట్విస్ట్..

బీ టౌన్ వర్గాల్లో సంచలనంగా మారిన డ్రగ్స్ రాకెట్‌లో తొలిప్రేమ హీరోయిన్ స్వప్న పబ్బి చిక్కుకుంది. ఎన్సీబీ నోటీసులు కూడా అందుకున్న ఆమె ప్రస్తుతం అజ్ఞాతంలో ఉందనే వార్తలు చూశాం. తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది స్వప్న పబ్బి.

Samayam Telugu 25 Oct 2020, 10:08 am
బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన డ్రగ్స్ ఇష్యూలో ఇప్పటికే ఎందరో సినీతారల పేర్లు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్సీబీ అధికారులు కూపీ లాగుతున్న కొద్దీ డ్రగ్స్ రాకెట్‌లో ఉన్న ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. బీ టౌన్‌తో పాటు పలువురు సౌత్ ఇండియన్ స్టార్స్‌కి కూడా డ్రగ్స్ పెడల్స్‌తో సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగులో తొలిప్రేమ సినిమాలో నటించిన హీరోయిన్ స్వప్న పబ్బి డ్రగ్స్ రాకెట్‌లో చిక్కుకుంది.
Samayam Telugu తొలిప్రేమ హీరోయిన్‌కి ఎన్సీబీ నోటీసులు.. డ్రగ్స్ ఉచ్చులో పడి జంప్!
Sapna Pabbi


లోతుగా విచారణ చేపట్టి ఇప్పటికే స్వప్న పబ్బికి నోటీసులు జారీ చేశారు ఎన్సీబీ అధికారులు. కానీ ఆమె మాత్రం అధికారులకు చిక్కకుండా ఇంకా అజ్ఞాతంలోనే ఉంది. దీంతో ఆమెపై అనేక రూమర్స్ బయటకొచ్చాయి. స్వప్న పబ్బి కోసం ఎన్సీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారని, అయితే ఎవ్వరికీ దొరకకుండా ఆమె తప్పించుకు తిరుగుతోందని వార్తలు వస్తున్నాయి. దీంతో తాజాగా ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన స్వప్న పబ్బి.. తగు వివరణ ఇచ్చింది.

Also Read: Samantha: బిగ్ బాస్ హోస్ట్‌గా సమంత కన్ఫమ్.. నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదంటూ ఎంట్రీ

తనకు ఎన్సీబీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే గానీ, అజ్ఞాతంలోకి వెళ్లానని వస్తున్న వార్తల్లో నిజం లేదని స్వప్న పబ్బి పేర్కొంది. మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్తలు చూసి షాక్ అయ్యానని తెలిపింది. నిజానికి తాను లండన్‌లో ఫ్యామిలీతో ఉన్నానని, తన తరుఫున తన లాయర్స్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పింది. తన గురించిన పూర్తి సమాచారం అధికారుల వద్ద ఉందని పేర్కొన్న ఆమె.. సరైన ఆధారాలు లేకుండా వార్తలు రాస్తుండటం చూస్తే బాధేస్తోందని తెలిపింది.
View this post on Instagram 🙏🏽 A post shared by S a p n a P a b b i (@sapnapabbi_sappers) on Oct 22, 2020 at 8:15am PDT

వరుణ్ తేజ్ హీరోగా ఇటీవలే వచ్చిన 'తొలిప్రేమ' సినిమాలో స్వప్న పబ్బి నటించింది. సునయన పాత్రలో కనిపించిన ఆమె వరుణ్ తేజ్‌తో కలిసి స్టెప్పులు కూడా వేసి ఆకట్టుకుంది. ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి 'డ్రైవ్' మూవీలో నటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.