పుష్ఠిగా తిని కూర్చుంటే ఎవరికైనా కాస్త కండ పడుతుంది. కొంతమంది ఎంత తిన్నా లావు కాలేరు. ఇంకొంతమంది ఏం తినకుండానే లావైపోతుంటారు. వీటికి వారి శరీరతత్వం, వంశపారంపర్యం ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. అయితే పెళ్లైతే లావైపోతారనే అపోహ చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లు పెళ్లైతే లావైపోతారనే ప్రచారం ఎక్కువగానే ఉంది. అయితే ఈ ప్రచారానికి తానూ మినహాయింపు కాదంటుంది కమల్ కూతురు శ్రుతిహాసన్.
‘శ్రీమంతుడు’, రేసు గుర్రం, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో నటించిన మెప్పించిన శ్రుతిహాసన్ ఈ మధ్య కాలంలో సినిమాలకు బ్రేక్ ఇచ్చి మ్యూజిక్ షోలతో బిజీగా మారింది. స్వతహాగా సింగర్ అయిన శ్రుతిహాసన్కి సొంత మ్యూజిక్ బ్యాండ్ ఉండటంతో మ్యూజిక్ షోలు నిర్వహిస్తూ ఉంటుంది. పలు చిత్రాల్లోనూ పాటలు పాడి తన మల్టీటాలెంట్ను నిరూపించుకుంది శ్రుతిహాసన్.
అయితే ఇటీవల కాలంలో వరుస మ్యూజిక్ షోలతో తన ఆరోగ్యం పాడైందని.. దీని కారణంగా లావయ్యానని.. అయితే తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టారని.. శ్రుతిహాసన్కి పెళ్లైపోయింది అందుకే లావైపోయిందంటూ కామెంట్స్ చేశారని అవి నన్ను చాలా బాధించాయన్నారు శ్రుతిహాసన్.
ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్ బ్రేకప్, పెళ్లి అంశాలపై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. లండన్కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖెల్ కోర్సేల్తో కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న శ్రుతి.. ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. 2019 ఏప్రిల్ 26న వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే.. తామిద్దరం పరస్పరం చర్చించుకునే ఈ నిర్ణయానికి వచ్చామని శ్రుతి హాసన్ తెలిపారు. తాము తీసుకున్న నిర్ణయంపై ఆమె సన్నిహితులు, స్నేహితులు షాకైనట్లు చెప్పారు.
‘మైఖెల్తో బ్రేకప్ అయ్యానని తెలియగానే చాలా మంది షాకయ్యారు. శ్రుతి ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి అనుకున్నారు. కానీ, నేను తీసుకున్న ఉత్తమ నిర్ణయం ఇది. నాకు నా సంతోషమే ముఖ్యం.. నేనిప్పుడు సింగిల్గా హ్యాపీగా ఉన్నా.. ఈ టైంలో నాకు సంతోషంతో పాటు గౌరవం కూడా కావాలన్నారు శ్రుతిహాసన్.