యాప్నగరం

Veera Simha Reddy లో తన పాత్ర నిడివిపై పెదవి విప్పిన శృతి హాసన్.. తనకి ముందే తెలుసట

Veera Simha Reddy Movie లో హీరోయిన్ శృతి హాసన్ పాత్ర చాలా పరిమితం. కేవలం పాటల కోసమే శృతి హాసన్‌ని ఈ మూవీలోకి తీసుకున్నట్లు కనిపించింది. అయితే.. వాల్తేరు వీరయ్య మూవీలో కాస్త బెటర్. ఫస్ట్ హాఫ్‌లో ఈ అమ్మడిపై కొన్ని సీన్స్ పెట్టారు. ఈ ఏడాది ప్రభాస్ సరసన సలార్ మూవీలో కూడా శృతి హాసన్ నటించబోతోంది. దాంతో సినిమాల్లో తన పాత్ర నిడివిపై ఈ అమ్మడు స్పందించింది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 17 Jan 2023, 8:34 pm

ప్రధానాంశాలు:

  • తెలుగులో వరుసగా రెండు సినిమాలు చేసిన శృతి హాసన్
  • వీరసింహా రెడ్డి మూవీలో శృతి పాత్ర పాటలకే పరిమితం
  • వాల్తేరు వీరయ్యలో ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్
  • ప్రభాస్‌తో సలార్ మూవీలో చేస్తున్న శృతి హాసన్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Actress Shruti Haasan, Veera Simha Reddy
వీరసింహా రెడ్డి మూవీలో బాలకృష్ణ, శృతి హాసన్
సీనియర్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) తెలుగులో మళ్లీ వరుసగా సినిమాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో కలిసి ఆమె నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణతో నటించిన వీరసింహా రెడ్డి (Veera Simha Reddy) సినిమాలు రోజు వ్యవధిలో సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. ఇందులో వాల్తేరు వీరయ్య హిట్ టాక్‌ని సొంతం చేసుకోగా.. వీరసింహా రెడ్డి మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ.. రెండు సినిమాలు కూడా ఇప్పటికే రూ.100 కోట్ల మార్క్‌ని దాటేసి.. థియేటర్లలో కొనసాగుతున్నాయి.
శృతి హాసన్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులో నటించింది. కానీ.. వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) మూవీలో ఆమెకి కాస్త నటనకి ఆస్కారం ఉన్న పాత్ర దొరకగా.. వీరసింహా రెడ్డిలో కేవలం పాటలకే శృతి హాసన్‌ని పరిమితం చేసినట్లు కనిపించింది. ఇదే విషయాన్ని శృతి హాసన్‌ని అడగగా.. ఈ విషయం తనకి ముందే తెలుసని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. వీరసింహా రెడ్డి మూవీ కథ మొత్తం నందమూరి బాలకృష్ణ చుట్టూనే తిరుగుతుందని స్టోరీ చెప్పక ముందే డైరెక్టర్ గోపీచంద్ మలినేని తనకి చెప్పినట్లు శృతి హాసన్ గుర్తు చేసుకుంది.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతి హాసన్‌కి ఇది రెండో సినిమా. రవితేజ హీరోగా చేసిన క్రాక్ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా.. ఈ మూవీలో హీరోయిన్ శృతి హాసనే. 2019లోనే షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ఈ సినిమా 2021లో రిలీజైంది. ఆ తర్వాత శృతి హాసన్ పెద్ద సినిమాల్లో నటించలేదు. అయితే.. ఈ ఏడాది మరో పెద్ద సినిమాలో కూడా ఈ అమ్మడు నటించబోతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ సలార్‌లో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

వీరసింహా రెడ్డి మూవీలో శృతి హాసన్‌తో పాటు మరో హీరోయిన్ హనీ రోస్ కూడా నటించింది. ఇద్దరి పాత్రలు పరిమితంగానే తెరపై కనిపించాయి. ఈ ఇద్దరి కంటే నెగటివ్ రోల్ పోషించిన వరలక్ష్మి శరత్‌ కుమార్ ఎక్కువ సేపు స్క్రీన్‌పై కనిపించింది. దాంతో శృతి హాసన్ రోల్‌పై నెటిజన్లు జోక్‌లు పేల్చారు. అయితే వాల్తేరు వీరయ్య మూవీలో రా ఏజెంట్‌గా కనిపించిన శృతి హాసన్ ఫస్ట్ హాఫ్‌లో చిరంజీవితో కలిసి కాసేపు సందడిగా కనిపించింది. కానీ.. సెకండాఫ్‌లో కేవలం పాటలకే ఆమె పరిమితమైంది.

Read Latest Telugu Movies News , Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.