యాప్నగరం

Shruti Haasan కి సైకలాజికల్ ప్రాబ్లమ్.. సమంత తరహాలో చెప్పేసిన హీరోయిన్!

Shruti Haasan గత కొంతకాలంగా ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతోందట. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా ఈ హీరోయిన్ చెప్పింది. ప్రస్తుతం తెలుగులో సీనియర్ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు.. నెక్ట్స్ ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీలో కనిపించబోతోంది. అయితే.. అనుకున్న పని అనుకున్నట్లు జరగకపోతే తనకి విపరీతమైన కోపం వస్తుందని చెప్పుకొచ్చిన శృతి హాసన్.. ఆ టైమ్‌లో పక్కన ఉన్న వారిపై అరిచేస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 12 Jan 2023, 3:09 pm

ప్రధానాంశాలు:

  • వీరసింహా రెడ్డి మూవీలో నటించిన శృతి హాసన్
  • రేపు రిలీజ్ కాబోతున్న వాల్తేరు వీరయ్యలోనూ శృతినే హీరోయిన్
  • ఈ ఏడాది ప్రభాస్‌తో కూడా ఓ సినిమాలో నటించబోతున్న బ్యూటీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu shruti haasan
శృతి హాసన్
టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్లలో ప్రస్తుతం శృతి హాసన్ (Actress shruti haasan) కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీలో హీరోయిన్‌గా చేసిన శృతి హాసన్.. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) మూవీ వీరసింహా రెడ్డి (Veerasimha Reddy)లోనూ హీరోయిన్‌గా చేసింది. అలానే ప్రభాస్‌తో ఈ ఏడాది ఒక సినిమాలో శృతి హాసన్ నటించబోతోంది. ఈ మూడింటిలో ఒకటి హిట్ అయినా.. శృతి హాసన్‌కి కొన్నాళ్ల పాటు ఢోకా ఉండదు.
ఒంగోలులో గత వారం జరిగిన వీరసింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌కి హాజరైన శృతి హాసన్.. ఆ తర్వాత విశాఖపట్నంలో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి మాత్రం హాజరు కాలేదు. ఆమెకి ఒంగోలులో పుడ్ పాయిజన్ అయ్యిందని చిరంజీవి చెప్పుకొచ్చారు. కానీ.. ఆ ఈవెంట్ తర్వాత కూడా శృతి హాసన్ ఏ సినిమా ప్రమోషన్స్‌లోనూ కనిపించలేదు. అయితే.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ తన వ్యక్తిగత విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తాను గత కొంతకాలంగా ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది.

ఆ ఇంటర్వ్యూలో శృతి హాసన్ ఏం చెప్పిందంటే? ‘‘నేను గత కొంతకాలంగా ఒక సైకలాజిల్ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతున్నాను. ఏదైనా నేను అనుకున్నది అనుకున్నట్లు జరగకపోతే.. వెంటనే కోపం వచ్చేస్తోంది. ఆ క్రమంలో సహనం కోల్పోయి పక్కన ఉన్న వాళ్ల మీద అరిచేస్తున్నా. ఈ విషయాన్ని గతంలో ఎన్నోసార్లు చెప్పాలనుకున్నా.. కానీ ఏం అనుకుంటారో అని భయపడ్డాను. అయితే ఇటీవల కొంత మంది తాము బాధపడుతున్న సమస్యల్ని బహిరంగంగా చెప్తున్నారు. దాంతో నేను కూడా ధైర్యంగా చెప్పేస్తున్నా’’ అని వెల్లడించింది.

సైకలాజికల్ పాబ్లమ్ నుంచి బయటపడేందుకు గత కొన్నాళ్ల నుంచి థెరపీ తీసుకుంటున్నట్లు వెల్లడించిన శృతి హాసన్.. ఆ టైమ్‌లో సంగీతం వినేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది. గత ఏడాది హీరోయిన్ సమంత తాను మయోసైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేసింది. అలానే మరో హీరోయిన్ నభా నటేష్ తనకి గత ఏడాది ఒక యాక్సిడెంట్ జరిగిందని.. ఆ సమయంతో భుజానికి సర్జరీ చేయించుకున్నట్లు ఆలస్యంగా చెప్పింది. ఇలా ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్స్ తమ వ్యక్తిగత విషయాలు, రుగ్మతల గురించి బహిరంగంగానే చెప్తున్నారు. దీపికా పదుకొణె లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

Read Latest Telugu Movies News , Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.