యాప్నగరం

తొడగొట్టిన శ్రీరెడ్డి.. పవిత్రా లోకేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. ఆమెకు ఎందరితోనో అపవిత్ర బంధాలు

పవిత్ర, నరేష్ కాంట్రావర్సీపై నటి శ్రీరెడ్డి స్పందించింది. పవిత్రా లోకేశ్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. ఆమె ఎంతోమందితో రిలేషన్‌షిప్స్ పెట్టుకుందని.. ఇతరుల జీవితాల్లో నిప్పులు ఎందుకు పోస్తున్నావని ఫైర్ అయింది.

Authored byAshok Krindinti | Samayam Telugu 4 Jul 2022, 8:38 am
తాను సైలెంట్‌గా మాట్లాడేందుకు రాలేదంటూ తొడగొట్టి మాట్లాడింది శ్రీరెడ్డి. ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడిన శ్రీరెడ్డి.. నటి పవిత్రా లోకేశ్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించింది. 'నరేష్ భార్య విషయంలో కలుగజేసుకునేందుకు నువ్వు ఎవరు..? ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడేందుకు నువ్వు ఎవరు..? ఆమెకు మాట్లాడేందుకు హక్కు ఉంది. ఎందుకు ఇతరుల జీవితాల్లో నిప్పులు పోస్తున్నావు.
Samayam Telugu పవిత్రా లోకేశ్‌పై శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు


నువ్వు ఎందరితో అయినా రిలేషన్‌షిప్స్ పెట్టుకోవచ్చు. మీ టూ ఉద్యమం గురించి మేం మాట్లాడితే.. మాకు వ్యతిరేకంగా మాట్లాడింది. నరేష్ కూడా నన్ను మా అసోసియేషన్‌లో నాలుగేళ్లు బ్యాన్ చేశాడు. అతను నలుగురు ఐదుగురితో అపవిత్ర బంధాలు పెట్టుకోవచ్చు. ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మీ టూ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి జీవితాలు ఏమవుతున్నాయో అందరికీ తెలిసిందే. వారు నటించిన సినిమాలు అట్టర్ ఫ్లాపులు అవుతున్నాయి.

నేను ఓడిపోలేదు. నేను ఆ రోజు మొదలుపెట్టిన ఉద్యమం ఫలాలు ఈ రోజు వస్తున్నాయి. తమిళనాడుకు వచ్చి నాకంటూ ఫ్యాన్స్, ఫ్రెండ్స్‌ను సంపాదించకున్నా. టాలీవుడ్‌లో నన్ను నిలబడనివ్వకుండా మెగా ఫ్యామిలీ తొక్కేసింది. మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ మాత్రమే కష్టపడి పైకి వచ్చాడు. మిగిలిన వాళ్లు టాలెంట్‌ లేక అక్కడే ఆగిపోయారు.

నన్ను బిగ్‌బాస్‌కు రాకుండా అడ్డుకున్నారు. నన్ను పైకి రానీయకుండా చుట్టూ కంచెలు ఏర్పాటు చేశారు. నాతో అడుకున్న వారందరూ నాశనం అయిపోవాలి. నేను ఎంతో ఇబ్బంది పడ్డా. నేను ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నానో నేను పడుకునే దిండుకు తెలుసు..' అంటూ శ్రీరెడ్డి ఏడుస్తూ.. తన బాధను చెప్పుకొచ్చింది. కర్మ అనేది ఎవరినీ వదిలిపెట్టదని.. కచ్చితంగా అనుభవించి తీరుతారని అంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.