యాప్నగరం

జగనే రావాలి.. శత్రుశేషం ఉంచొద్దంటున్న వివాదాస్పద నటి

ఎన్నికలు ముగిసిన తరువాత రాష్ట్రానికి కొత్త నాయకుడు వస్తే.. మరింత ఉపయోగం ఉంటుందని చాలా మంది జగన్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ అభిప్రాయ పడింది.

Samayam Telugu 10 May 2019, 8:33 pm
మరో 13 రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఎవరి లెక్కల్లో వాళ్లు ఉండగా.. జగన్ వచ్చి అందరి లెక్కలు తేల్చాలంటోంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. పొలిటికల్ అయినా సినిమా అయినా అగ్గిరాజేయడాన్నే అలవాటుగా చేసుకుని పాపులారిటీ కోసం సోషల్ మీడియాని హీటెక్కించే శ్రీరెడ్డి.. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వర్గాల మధ్య అగ్గిరాజేసే వ్యాఖ్యలు చేసింది.
Samayam Telugu YS Jagan


జగన్ ఫొటోని షేర్ చేస్తూ.. ‘మీరు రావాలి, అందరి లెక్కలు సరి చేయాలి. కావాలి జగన్.. రావాలి జగన్.. ఎవ్వరి శత్రుశేషం ఉంచొద్దు’ అంటూ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

ఇక అంతకు ముందు కూడా జగన్‌కి అనుకూలంగా పలు పోస్ట్‌లు వదిలింది శ్రీరెడ్డి. ఎన్నికలు ముగిసిన తరువాత రాష్ట్రానికి కొత్త నాయకుడు వస్తే.. మరింత ఉపయోగం ఉంటుందని చాలా మంది జగన్ వైపు మొగ్గు చూపుతున్నారంటూ అభిప్రాయ పడింది. చంద్రబాబు పాలనలో చాలా మంది విసిగిపోయిన వారు లేకపోలేదు. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన పొరపాట్లు జగన్‌కి కలిసి వస్తున్నాయి. ఆయన చేసిన పాదయాత్రతో చాలా మంది జనం జగన్‌కి దగ్గరయ్యారు. ఇవన్నీ బేరీజు వేసుకుంటే.. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడానికి 60 శాతం ఛాన్స్ ఉండగా.. టీడీపీకి 40 శాతం అవకాశాలు ఉన్నాయి’ అంటూ లెక్కలు చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.