బయోపిక్ చిత్రాలు రాజకీయ రంగు పులుముకున్నాయి. మొన్నటి వరకూ బయోపిక్ అంటే మహానుభావుల జీవితాలను నేటి తరాలకు మార్గదర్శకంగా ఉండేందుకు మంచిని రూపొందించడం. కాని ఇప్పుడు అర్ధం మారింది. సినిమా కూడా ఓ ప్రచార సాధనంగా మారిపోవడంతో దీన్ని రాజకీయాలకు వాడేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ బయోపిక్ల హడావిడి ఊపందుకుంది. ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తొలిభాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కాగా.. రెండో భాగం ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఈనెల 22న విడదుల కానుంది. ఇక వైఎస్ఆర్ బయోపిక్ మూవీ ఫిబ్రవరి 8న విడుదలైంది.
వీటితో పాటు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్తో అంచనాలు పెంచేసి విడుదలకు రెడీ అయ్యింది. ఈ మూవీ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తరువాత జరిగిన పరిణామాలను నాటి వాస్తవ పరిస్థితుల్ని చూపించబోతున్నారు వర్మ.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి పోటీగా లక్ష్మీ పార్వతిని నెగిటివ్గా చూపిస్తూ.. ‘లక్షీస్ వీరగ్రంధం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. నాగరుషి ఫిలిమ్స్ బ్యానర్లో సిరిపురపు విజయ భాస్కర్ రెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. అయితే ఈ మూవీలో లక్ష్మీ పార్వతి పాత్రను వివాదాస్పద నటి శ్రీరెడ్డి నటించబోతుందంటూ బాంబ్ పేల్చేరు దర్శకుడు కేతిరెడ్డి. మొన్నటి వరకూ ఈ పాత్రలో సీనియర్ నటి నటించబోతుందంటూ ప్రచారం చేసిన దర్శకుడు చివర్లో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో అర్ధనగ్న ప్రదర్శన ద్వారా వార్తల్లోకి వచ్చిన శ్రీరెడ్డి.. ఆఫర్ల పేర్లుతో తనను ఎవరెవరు వాడుకున్నారో ఆధారాలతో సహా చూపిస్తూ రసిక రాజుల గుట్టుని బట్టబయలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్లోనూ అనేక మందితో తనకు సంబంధాలు ఉన్నాయంటూ ప్రకంపనలు రేపింది. తరువాత కాలంలో ఆమెను మీడియా లైట్ తీసుకోవడంతో తమిళనాడుకు చెక్కేసిన శ్రీరెడ్డి.. అక్కడే మకాం పెట్టింది. ఇటీవల హైదరాబాద్ తిరిగి వచ్చిన శ్రీరెడ్డిని లక్ష్మీస్ వీరగ్రంధం దర్శకుడు కలసి ఈ ఆఫర్ ఇవ్వడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే పూర్తి కథను ఇంకా ఆమెకి చెప్పలేదని.. కథ కంప్లీట్ అయ్యాక మార్పులు చేర్పులు ఉంటే ఆలోచిస్తామని.. ప్రస్తుతానికి ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రకు శ్రీరెడ్డి ఫైనల్ అయినట్టు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిని పూర్తి నెగిటివ్ షేడ్లో చూపించబోతున్నారు. వీరగ్రంథం వెంకట సుబ్బారావుని వివాహం చేసుకుని ఒక టీచర్గా బతుకుసాగిస్తున్న లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా అడుగుపెట్టింది. ఆమె ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఎలా ప్రభావింతం చేసింది లాంటి అంశాలను ఇందులో చూపించబోతున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన టీజర్లో లక్ష్మీ పార్వతి ఊహా చిత్రం ద్వారా ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు దర్శకుడు. ‘విశ్వవిఖ్యాతకే విశ్వరూపం చూపించిన దాన్ని.. నాకు మీరో లెక్కా.. రేపటి మఖ్యమంత్రిని నేనే.. నన్నెవ్వరూ ఆపలేరు.. నా దారికి ఎవ్వరు అడ్డొచ్చినా తొక్కేస్తా’ అంటూ లక్ష్మీ పార్వతి చెప్తున్న డైలాగ్స్ ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ ఏ ఉద్దేశంతో రూపొందిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
వీటితో పాటు రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్తో అంచనాలు పెంచేసి విడుదలకు రెడీ అయ్యింది. ఈ మూవీ ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తరువాత జరిగిన పరిణామాలను నాటి వాస్తవ పరిస్థితుల్ని చూపించబోతున్నారు వర్మ.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి పోటీగా లక్ష్మీ పార్వతిని నెగిటివ్గా చూపిస్తూ.. ‘లక్షీస్ వీరగ్రంధం’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. నాగరుషి ఫిలిమ్స్ బ్యానర్లో సిరిపురపు విజయ భాస్కర్ రెడ్డి సమర్పణలో ఈ చిత్రం రూపొందనుంది. అయితే ఈ మూవీలో లక్ష్మీ పార్వతి పాత్రను వివాదాస్పద నటి శ్రీరెడ్డి నటించబోతుందంటూ బాంబ్ పేల్చేరు దర్శకుడు కేతిరెడ్డి. మొన్నటి వరకూ ఈ పాత్రలో సీనియర్ నటి నటించబోతుందంటూ ప్రచారం చేసిన దర్శకుడు చివర్లో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఉదంతంలో అర్ధనగ్న ప్రదర్శన ద్వారా వార్తల్లోకి వచ్చిన శ్రీరెడ్డి.. ఆఫర్ల పేర్లుతో తనను ఎవరెవరు వాడుకున్నారో ఆధారాలతో సహా చూపిస్తూ రసిక రాజుల గుట్టుని బట్టబయలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్లోనూ అనేక మందితో తనకు సంబంధాలు ఉన్నాయంటూ ప్రకంపనలు రేపింది. తరువాత కాలంలో ఆమెను మీడియా లైట్ తీసుకోవడంతో తమిళనాడుకు చెక్కేసిన శ్రీరెడ్డి.. అక్కడే మకాం పెట్టింది. ఇటీవల హైదరాబాద్ తిరిగి వచ్చిన శ్రీరెడ్డిని లక్ష్మీస్ వీరగ్రంధం దర్శకుడు కలసి ఈ ఆఫర్ ఇవ్వడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే పూర్తి కథను ఇంకా ఆమెకి చెప్పలేదని.. కథ కంప్లీట్ అయ్యాక మార్పులు చేర్పులు ఉంటే ఆలోచిస్తామని.. ప్రస్తుతానికి ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి పాత్రకు శ్రీరెడ్డి ఫైనల్ అయినట్టు చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిని పూర్తి నెగిటివ్ షేడ్లో చూపించబోతున్నారు. వీరగ్రంథం వెంకట సుబ్బారావుని వివాహం చేసుకుని ఒక టీచర్గా బతుకుసాగిస్తున్న లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా అడుగుపెట్టింది. ఆమె ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ఎలా ప్రభావింతం చేసింది లాంటి అంశాలను ఇందులో చూపించబోతున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన టీజర్లో లక్ష్మీ పార్వతి ఊహా చిత్రం ద్వారా ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పారు దర్శకుడు. ‘విశ్వవిఖ్యాతకే విశ్వరూపం చూపించిన దాన్ని.. నాకు మీరో లెక్కా.. రేపటి మఖ్యమంత్రిని నేనే.. నన్నెవ్వరూ ఆపలేరు.. నా దారికి ఎవ్వరు అడ్డొచ్చినా తొక్కేస్తా’ అంటూ లక్ష్మీ పార్వతి చెప్తున్న డైలాగ్స్ ‘లక్ష్మీస్ వీరగ్రంధం’ ఏ ఉద్దేశంతో రూపొందిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.