యాప్నగరం

తాప్సీ ఇంట్లో విషాదం.. శూన్యాన్ని వదిలి వెళ్లిందంటూ భావోద్వేగ పోస్ట్

ఝమ్మంది నాదం చిత్రంతో ఇండస్ట్రీకి పరచయం అయిన తాప్సీ పన్ను.. వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ఫెక్ట్, వీరా, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో వంటి చాలా చిత్రాల్లో నటించింది.

Samayam Telugu 30 May 2020, 7:19 pm
బాలీవుడ్ సంచలన నటి తాప్సీ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. తాప్సీ బామ్మ శనివారం నాడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు తాప్సీ. గురుద్వారాలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఒక ఫోటోను పోస్ట్ చేసిన తాప్సీ.. ‘కుటుంబంలో పాత తరాల వారు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారు’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు తాప్సీ.
Samayam Telugu తాప్సీ (Taapsee Pannu)
Taapsee Pannu


తెలుగులో మంచు మనోజ్ ‘ఝమ్మంది నాదం’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన తాప్సీ.. వస్తాడు నా రాజు, మిస్టర్ పర్ఫెక్ట్, వీరా, మొగుడు, దరువు, గుండెల్లో గోదారి, షాడో వంటి చాలా చిత్రాల్లో నటించినప్పుటికీ ఆమెలోని నటికి పనిచెప్పే పాత్ర ఒక్కటీ పడకపోవడంతో బాలీవుడ్‌కి షిప్ట్ అయ్యింది. బాలీవుడ్‌లో పింక్, ఘాజీ, తాపడ్ వంటి చిత్రాల్లో ప్రయోగాత్మక పాత్రలు చేసి సంచలన నటిగా గుర్తింపుతెచ్చుకుంది. తెలుగు, హిందీతో పాటు తమిళ్‌లోనూ పలు చిత్రాలు చేసింది తాప్సీ. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లిన తరువాత తాప్సీ కెరియర్ ఊపందుకుంది. ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది తాప్సీ.

ఇక వివాదాల్లోనూ ముందుంటే తాప్సీ.. దర్శకేంద్రుడు కె. రాఘంవేంద్రరావు హీరోయిన్స్ బుడ్డు చూపించి కొబ్బరి కాయలతో కొట్టించడంపై అభ్యతరం చెప్తూ వివాదాస్పద కామెంట్ చేసింది తాప్సీ.
View this post on Instagram The last of that generation in the family leaves us with a void that will stay forever.... Biji ❤️ A post shared by Taapsee Pannu (@taapsee) on May 30, 2020 at 3:04am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.