యాప్నగరం

విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకున్న అదితీరావు హైదరి

విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్న ‘తుగ్లక్ దర్బార్’ సినిమా నుంచి నటి అదితీరావు హైదరి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించారు.

Samayam Telugu 21 Oct 2020, 6:06 pm
తమిళ స్టార్ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కనున్న ‘తుగ్లక్ దర్బార్’ సినిమా నుంచి నటి అదితీరావు హైదరి తప్పుకున్నారు. ఆమె స్థానంలో రాశీ ఖన్నాను తీసుకున్నారు. ఈ విషయాన్ని అదితీరావు హైదరి తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
Samayam Telugu అదితీరావు హైదరి, విజయ్ సేతుపతి
Aditi Rao Hydari, Vijay Sethupathi


‘‘కరోనా మహమ్మారి కారణంగా ఈ ప్రపంచంతో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఈ ఏడాది 6 నుంచి 8 నెలలు నిలిచిపోయింది. ప్రస్తుతం పనులు దశల వారీగా మెల్లగా ప్రారంభమవుతున్నాయి. సినీ పరిశ్రమ మళ్లీ యథాస్థానానికి చేరుకుంటోంది. వాయిదా పడిన, షెడ్యూల్ చేసిన షూటింగ్‌లు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇలాంటి సమయంలో నా కోసం ఏ ఒక్కరూ వేచి చూడాల్సిన అవసరం రాకూడదని ఒక నటిగా నేను భావిస్తున్నాను.

ఇప్పటికే నేను షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్టులను ముందుగా పూర్తిచేయాలని నేను నిర్ణయించుకున్నాను. అలాగే, ఇంకా ప్రారంభం కాని ప్రాజెక్టులు నా కారణంగా ఆలస్యం కాకూడదు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సెవెన్ స్క్రీన్ స్టూడియో అధినేత, నిర్మాత లలిత్ కుమార్, డైరెక్టర్ ఢిల్లీ ప్రసాద్ దీన్‌దయాల్‌తో చర్చించి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.

ఈ సందర్భంగా డైరెక్టర్ ఢిల్లీ ప్రసాద్‌కి, విజయ్ సేతుపతికి, ‘తుగ్లక్ దర్బార్’ టీమ్ మొత్తానికి మంచి జరగాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాశీ ఖన్నాకు కూడా నా శుభాకాంక్షలు. నువ్వు ఈ సినిమా చిత్రీకరణను ఆస్వాదిస్తావని భావిస్తున్నాను. అలాగే, నా వెన్నంటే ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు. త్వరలోనే మీ అందరినీ థియేటర్‌లో కలుసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి’’ అని అదితీరావు హైదరి తన ప్రకటనలో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.