యాప్నగరం

గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన అడివి శేషు, దేత్తడి హారిక

నటుడు అడివి శేషు, యూట్యూబ్ యాంకర్ దేత్తడి హారిక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఛాలెంజ్‌లో భాగంగా వీరిద్దరూ మొక్కలు నాటారు.

Samayam Telugu 26 Jun 2020, 11:00 pm
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతలో భాగంగా నటుడు, దర్శకుడు అడివి శేషు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. యాంకర్, నటి అనసూయ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన అడివి శేషు.. శుక్రవారం జూబ్లీ హిల్స్‌లో మొక్కలు నాటారు.
Samayam Telugu మొక్కలు నాటుతోన్న అడివి శేషు, హారిక
Adivi Seshu, Dethadi Harika


ఈ సందర్భంగా అడివి శేషు మాట్లాడుతూ.. ‘‘పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం మొక్కలు నాటాలి. వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ గారికి కృతజ్ఞతలు. ఈ ఛాలెంజ్‌కు హీరోయిన్ శోభిత ధూళిపాళ, డైరెక్టర్ శశి కిరణ్‌లను నామినేట్ చేస్తున్నాను’’ అని అన్నారు.

Adivi Seshu

మరోవైపు, ప్రముఖ యూట్యూబ్ యాంకర్ దేత్తడి హారిక కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. హీరో నవీన్ కుమార్ (అభయ్ భేతిగంటి) ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి జూబ్లీ హిల్స్‌లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశాం. వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనందరం మొక్కలు నాటాలి’’ అని అన్నారు. ఈ సందర్భంగా యాంకర్ రవి, ఆర్జే చైతు, సింగర్ సాకేత్‌లను గ్రీన్ ఛాలెంజ్‌కు ఆమె నామినేట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.