adivi sesh కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం ఐసో లేషన్లో ఉన్నాడు. దీంతో బయటకు వచ్చి సినిమాలను చూడలేని పరిస్థితిలోకి వెళ్లాడు. ఈ శుక్రవారం విడుదలైన బింబిసారా, సీతారామం రెండు సినిమాలకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో టాలీవుడ్ కళకళలాడుతోంది. ఇదే విషయాన్ని అడివి శేష్ చెప్పుకొచ్చాడు. ‘ఉదయం లేచిన క్షణం నుంచి ఈ రెండు సినిమాలకు సంబంధించి పాజిటివ్ రిపోర్ట్స్ వింటున్నాను.. చాలా సంతోషంగా ఉంది.. ఇది కదా కావాల్సింది.. కోవిడ్ వచ్చి ఐసో లేషన్లో ఉన్నా.. నా కోసం మార్నింగ్ షో ఒకటి.. మ్యాట్నీ ఒక సినిమా కుమ్మేయండి’ అని అడివి శేష్ అందరినీ రిక్వెస్ట్ చేశాడు.
అడివి శేష్ ఈ మధ్యే మేజర్ సినిమా అంటూ హిట్ కొట్టేశాడు. సౌత్లో ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మేజర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంబై పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ మెప్పించింది. ఇక ఇప్పుడు హిట్ 2 సినిమా కోసం అడివి శేష్ రెడీ అవుతున్నాడు. ఇంతలోనే ఇలా కరోనా బారిన పడ్డాడు. దీంతో ప్రస్తుతం ఐసోలేషన్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అడివి శేష్ ఈ శుక్రవారం విడుదలైన చిత్రాల గురించి స్పందించాడు. బింబిసారా, సీతారామం సినిమాలకు బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. మరి వీటి కలెక్షన్లు ఎలా ఉంటాయో ఇక చూడాలి. ఈ వీకెండ్ మాత్రం బాక్సాఫీస్ కళకళలాడబోతోందనేది మాత్రం నిజం.
అడివి శేష్ ఈ మధ్యే మేజర్ సినిమా అంటూ హిట్ కొట్టేశాడు. సౌత్లో ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా మేజర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంబై పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం అందరినీ మెప్పించింది.