యాప్నగరం

6 కోట్లకు హీరో కూతురు పిటిషన్!

అనుచిత ప్రచారం చేసినందుకు ఆరు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని

TNN 22 Aug 2017, 11:58 am
తమ కుటుంబ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమ పాఠశాలపై అనుచిత ప్రచారం చేసినందుకు ఆరు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై పరువు నష్టం దావా వేసింది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్. అతడు ఆశ్రమ పాఠశాలలోకి ప్రవేశించి అనుచితంగా ప్రవర్తించాడని.. అందుకు కోటి రూపాయలు, ఆశ్రమ పాఠశాల గురించి మీడియాకు తప్పుడు ప్రచారం చేశాడని అందుకు ఐదు కోట్లు.. మొత్తంగా ఆరు కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆమె చెన్నై హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Samayam Telugu aishwarya dhanush sues ashram school landlord for libel
6 కోట్లకు హీరో కూతురు పిటిషన్!


రజనీకాంత్ కుటుంబ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాల కు సంబంధించిన వివాదం గత కొన్నాళ్లుగా వార్తల్లో ఉంది. దీని నిర్వహణను రజనీకాంత్ భార్య లత చూస్తున్నారు. ఈ నేఫథ్యంలో ఆమె పాఠశాల భవనానికి అద్దె చెల్లించాలేదని దాని ఓనర్ వెంకటేశ్వర్లు మీడియాకు చెప్పాడు. కోట్ల రూపాయలు బకాయి పడ్డారని.. అందుకే తను తన బిల్డింగ్ కు తాళం వేస్తున్నట్టుగా అతడు ప్రకటించాడు. ఈ విషయం మీడియాలో ప్రముఖంగా ప్రచురితం అయ్యింది.

అయితే వెంకటేశ్వర్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని రజనీ కుటుంబం అంటోంది. ఈ విషయంపై కోర్టుకు ఎక్కింది. ఏకంగా ఆరు కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. లీజ్ అగ్రిమెంట్ ప్రకారం అతడికి తాము అద్దె చెల్లించామని కానీ చెల్లించలేదని అంటూ అబద్ధం చెబుతున్నాడని రజనీ కూతురు తన పిటిషన్లో పేర్కొన్నారు.

వెంకటేశ్వర్లు చేత పరువు నష్ట పరిహారం చెల్లింపజేయాలని, ఆశ్రమ పాఠశాల్లో మళ్లీ అతడు అడుగుపెట్టకుండా చూడాలని ఐశ్వర్య కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.