యాప్నగరం

ఐశ్వర్య కన్నీళ్లు పెట్టుకున్నారు!

ఐశ్వర్య రాయ్ బచ్చన్ మీడియా ముందు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. సోమవారం ఆమె తండ్రి కృష్ణారాజ్‌ రాయ్‌ జయంతి పురస్కరించుకుని ముంబయికి చెందిన స్మైల్‌ ట్రైన్ ఫౌండేషన్‌ ద్వారా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు.

TNN 21 Nov 2017, 1:29 pm
శ్వర్య రాయ్ బచ్చన్ మీడియా ముందు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. సోమవారం ఆమె తండ్రి కృష్ణారాజ్‌ రాయ్‌ జయంతి పురస్కరించుకుని ముంబయిలోని స్మైల్‌ ట్రైన్ ఫౌండేషన్‌ ద్వారా ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు. గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న 100 మంది చిన్నారులకు సర్జరీ చేయించనున్నట్లు ప్రకటించారు. ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యతో కలిసి అక్కడి పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి, తన తండ్రి జయంతి వేడుకలు నిర్వహించారు.
Samayam Telugu aishwarya rai bachchan starts crying after she failed to control the cameramen
ఐశ్వర్య కన్నీళ్లు పెట్టుకున్నారు!


ఆ కార్యక్రమానికి వచ్చిన ఫొటోగ్రాఫర్లు ఆమె ఫొటోలు తీయడానికి అత్యుత్సాహం చూపారు. అరుపులు, కేకలతో అక్కడ కాసేపు సేపు గందరగోళ వాతావరణం నెలకొంది. వాళ్లను నియంత్రించడం ఐశ్వర్య వల్ల కాలేదు.

దీంతో ఆమె.. ‘‘ప్లీజ్ నాకు ఫొటోలు తీయకండి. ఇది సినిమా ప్రిమియర్ షో కాదు. పబ్లిక్ ఈవెంట్ కూడా కాదు. మీరెందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ కార్యక్రమం దేన్ని ఉద్దేసించిందో తెలుసుకుని గౌరవంగా ప్రవర్తించండి’’ అంటూ ఉద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.

ఐశ్వర్య రాయ్ తండ్రి కృష్ణారాజ్‌ ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. కృష్ణారాజ్‌ కూడా గ్రహణం మొర్రితోనే జన్మించారు. 2011లో ఆయన గ్రహణం మొర్రి సమస్యతో బాధపడుతున్న దాదాపు 100 మంది చిన్నారులకు చికిత్స చేయించినట్లు ఐశ్వర్య ఈ సందర్భంగా తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.